Madhuranagarilo October 29 Episode 195: ఏంటి రాధా వాళ్ళు ఇంకా రాలేదు ఫోన్ చేసి కనుక్కుందాం అని రుక్మిణి రాధా కి ఫోన్ చేస్తుంది. రాధా ఫోన్ ఎత్తి హలో అక్క ఫైవ్ మినిట్స్ లో అక్కడ ఉంటాము అని రాదా అంటుంది. అమ్మ రాధా వాళ్ళు ఇంకో ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తున్నారు అని రుక్మిణి వాళ్ళ అమ్మతో అంటుంది. రాధా వాళ్ల ఇంటికి వస్తారు.రుక్మిణి చూడకముందే అబ్బాయిని పంపించేయాలి అని రాధ వల్ల నాన్న అంటాడు. ఏవండీ అల్లుడుగారు మొదటిసారిగా ఇంటికి వస్తున్నాడు ఎలా పంపించేద్దాము అని రాధ వాళ్ళ అమ్మ అంటుంది. పంపించకపోతే పెద్ద గొడవ అవుతుంది అని మురళి అంటాడు.అమ్మ అక్కేదమ్మా అని రాదా అడుగుతుంది. ఇప్పటిదాకా ఇక్కడే ఉందమ్మా మీ ఇద్దరికీ హారతి ఇవ్వడానికి హారతి ప్లేట్ తీసుకువస్తుంది అని వాళ్ళ అమ్మ అంటుంది. ఓకే రాధా నేను బయలుదేరుతాను అని శ్యామ్ అంటాడు. అదేంటి బాబు అప్పుడే వెళ్లిపోతారా అని రాధా వాళ్ళ అమ్మ అంటుంది.
ఆయనకి ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉందంటమ్మా అందుకే వెళ్తున్నాడు అని రాదా అంటుంది. అయితే వెళ్ళలే బాబు అని కంగారు పడుతూ రాధ వాళ్ళ అమ్మ అంటుంది. ఏవండీ అక్క హారతి ఇచ్చేదాకైనా ఉండొచ్చు కదా అని రాదా అంటుంది. రాధా హారతి ఇచ్చాక అల్లుడుగారు లోపలికి రాకుండా వెళ్ళకూడదు అందుకని అక్క రాకముందే పంపించేద్దాం అని రాదా వాళ్ళ అమ్మ అంటుంది. ఓకే రాధా వెల్లోస్తాను అని శ్యామ్ డబ్బులు తీసి రాధకి ఇచ్చి అవసరానికి పనికొస్తాయి ఉంచు అని ఇచ్చి వెళ్లిపోతాడు శ్యామ్. ఇంతలో రుక్మిణి వచ్చి ఏంటే నువ్వు ఒక్కదానివే వచ్చావు మీ ఆయన ని నాకు పరిచయం చేయవా అని అంటుంది. వచ్చి ఇప్పుడే వెళ్లిపోయాడు అక్క అని రాధ అంటుంది. తనేం పంపించలేదు తనకి ఆఫీసులో పని ఉందని వెళ్లిపోయాడు హారతి కొండెక్కిలా ఉంది దానికి ఇచ్చి లోపలికి తీసుకురా అని వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది.
అక్క నేను నిన్ను ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు అని రాదా వాళ్ళ అక్క మీద పడి ఏడుస్తుంది.మీరు ఇప్పుడు ఇంత అన్యోన్యంగా ఉన్నారు మీ మెడలో ఒక్కడే తాళి కట్టాడని తెలిస్తే ఏమైపోతారో ఏమో అని వాళ్ళ అమ్మ తన మనసులో అనుకుంటుంది. అయ్యో ఎవరో పరుసు పడేసుకున్నట్టున్నారే అని రుక్మిణి వెళ్లి తీయగానే పండు వచ్చి పరుసులాకుని ఇది మా డాడీ ది అని అంటాడు.పండును చూడగానే రుక్మిణికి చిన్నప్పుడు ఏ పరిస్థితుల్లో వదిలేశాను అని గుర్తుకు తెచ్చుకొని బాధపడి పండు నీ దగ్గరికి తీసుకొని నేను నాన్న మీ అమ్మని అని అంటుంది. నువ్వు మా అమ్మవి కాదు కాదు అని పండు అరుస్తూ నెట్టేస్తాడు. పండు తాను పెద్దమ్మ నాన్న భయపడకు అని రాదా అంటుంది. పెద్దమ్మ చనిపోయిందని చెప్పావు కదా చనిపోయిన పెద్దమ్మ ఎలా బతికి వచ్చింది చనిపోయిన వాళ్లు దయ్యం అవుతారంట పెద్దమ్మ దయ్యమా అని భయపడి వాళ్ళ తాతయ్యని గట్టిగా పట్టుకొని నాకు పెద్దమ్మ వద్దు ఏమి వద్దు తాతయ్య భయం వేస్తుంది లోపలికి వెళ్దాం పద అని పండు ఏడుస్తాడు. పండు ఆవిడ మీ పెద్దమ్మ నాన్న భయపడకు అని మురళి అంటాడు.
తాతయ్య నాకు భయం వేస్తుంది లోపలికి వెళ్దాం పద అని మురళిని తీసుకొని పండు లోపలికి వెళ్ళిపోతాడు. పండు మాటలు విన్నా రుక్మిణి ఏడుస్తుంది. బాధపడకు అక్క వాడు నీ ఫోటోలు చూస్తూ నువ్వు పెద్దమ్మ అని అనుకున్నాడు మాలాగే వాడు కూడా నువ్వు చనిపోయావని అనుకుంటున్నాడు ఇప్పుడు నువ్వు సడన్గా తిరిగి వచ్చేసరికి పాపం వాడికి ఏమీ అర్థం కావట్లేదు నేను అమ్మని కాదని వాడికి చెప్పితే వాడికి ఏం తెలుస్తుంది నువ్వు పెద్దమ్మవు కాదని వాళ్ళ అమ్మ వని చెబితే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు అక్క చాలా డిస్టర్బ్ అయిపోతాడు వాడికి అర్థమయ్యేలా చెప్పేదాకా వాడికి పెద్దమ్మ లాగానే ఉండు అక్క అవునక్కా మళ్ళీ ఇన్నాళ్లకు నువ్వు తిరిగి ఎలా వచ్చావు ఆరోజు ఏం జరిగింది అని రాదా అంటుంది.
బాబుని నీకు అప్పగించి వెళ్ళిపోయిన తరువాత నా అదృష్టమో దురదృష్టమో కానీ యాక్సిడెంట్ అయ్యి నేను కోమాలోకి వెళ్ళిపోయాను కోమాలోంచి బయటికి రాగానే నాకు జీవితం మీద ఆశ కలిగింది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేసాను అని రుక్మిణి అంటుంది. మరి నువ్వు కోమాలో ఉంటే హాస్పిటల్లో డాక్టర్లు చనిపోయావని దాన సంస్కారాలు కూడా మేమే చేశామని చెప్పారు అని రాధా అంటుంది. నేను ఆత్మహత్య చేసుకుంటానని లెటర్ రాసి పెట్టడం వల్ల వాళ్ల హాస్పిటల్ కి ఆత్మహత్య చేసుకున్న డెడ్ బాడీ ఏదో వచ్చి ఉంటుంది అది నేనే అనుకొని మీకు అలా చెప్పి ఉంటారు అని రుక్మిణి అంటుంది. ఏదైతేనేం అక్క నువ్వు తిరిగి వచ్చావు అంతే చాలు అని రాదా అంటుంది. ఇన్నాళ్లకు తిరిగి వచ్చిన నేను కొడుకుని దగ్గరకి తీసుకోకపోవడం కన్నా దురదృష్టం ఇంకేముంటుంది రాధా అని రుక్మిణి ఏడుస్తుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!