YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పలు కీలక నిర్ణయాలను ఇవేళ జరుగుతున్న కేబినెట్ భేటీలో తీసుకోనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రేపు కూడా ఢిల్లీలో ఉండనున్నారు. జగన్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైఎస్ షర్మిల పీసీీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికార పార్టీ లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు.
మరో పక్క ఇప్పటికిే టీడీపీ -జనసేన పొత్తు ఖరారు కాగా ఈ కూటమిలో బీజేపీలో కలుస్తుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఈ కూటమితో బీజేపీ కలిసే అంశంపై ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ కూటమితో బీజేపీ కలవకుండా ఉంటే చాలు అన్న రీతిలో వైసీపీ ఉందని అంటున్నారు. ఆ క్రమంలో బీజేపీ కోరితే ఒక రాజ్యసభ స్థానం ఇవ్వడానికి కూడా వైసీపీ సిద్దంగా ఉందని టాక్ నడుస్తొంది. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలకు షెడ్యుల్ విడుదల అయ్యింది. ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలన అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలంతో వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది.
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ తో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు, విభజన చట్టంలోని హామీలతో సహా రాజకీయ అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తొంది. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ – జనసేన వెంపర్లాడుతున్న ఈ తరుణంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.