CM Ramesh: అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ పై కేసు నమోదు అయ్యింది. డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారుల ఫిర్యాదు మేరకు చోడవరం పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదు చేశారు. డీఆర్ఐ అధికారుల విధులకు ఆటంకం కల్గించడంతో పాటు వారి చేతుల్లో ఉన్న పైళ్లను లాక్కునే ప్రయత్నం చేయడం, బెదిరింపులకు పాల్పడటంతో సీఎం రమేష్ తో పాటు చోడవరం టీడీపీ అభ్యర్ధి కేఎస్ఎన్ఎస్ రాజు, టైల్స్ వ్యాపారి బుచ్చిరాజు, రామకృష్ణలతో పాటు మరో ఇద్దరిపై ఐపీసీ సెక్షన్లు 143, 506, 342, 353, 201, 188 రెడ్ విత్ 149 కింద కేసు నమోదు అయ్యింది.
చోడవరం మండలం గాంధీ గ్రామంలో బుచ్చిరాజు అనే టీడీపీ సానుభూతిపరుడు హోల్ సేల్ టైల్స్, మార్బుల్ వ్యాపారం నిర్వహిస్తుండగా, గురువారం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరుగురు అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. జీఎస్టీ సక్రమంగా చెల్లించలేదంటూ షాపు రికార్డులను వారు తనిఖీ చేస్తుండగా, టైల్స్ వ్యాపారి బుచ్చిబాబు ఈ విషయాన్ని స్థానిక టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే రాజు, అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ కు ఫోన్ చేసి తెలియజేశారు.
దీంతో వెంటనే వారిద్దరూ తమ అనుచరులతో టైల్స్ షాపు వద్దకు చేరుకున్నారు. అధికారుల వద్ద నుండి రికార్డులను లాక్కునే ప్రయత్నం చేయడంతో పాటు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా తనిఖీలు చేస్తారంటూ వారిపై దౌర్జన్యానికి దిగారు. దీంతో సదరు అధికారి ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశారు.
YS Sharmila: ‘హత్యా రాజకీయాలను తరిమికొట్టాలి’ .. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వైఎస్ షర్మిల