Chaari 111 OTT: వెన్నెల కిషోర్ హీరోగా టాలీవుడ్ కి పరిచయం అవుతూ నటించిన మూవీ చారి 111. ఈ మూవీ ఇప్పుడు ఓటిటి లోకి వచ్చేసింది. స్పై యాక్షన్ కామెడీ కథాంశం తో తెరకెక్కిన ఈ మూవీ కి టీజీ కార్తీకుమార్ దర్శకత్వం వహించాడు. మార్చ్ 1 థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. మోస్తారు కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద డిసప్పాయింట్ చేసింది. శుక్రవారం ఈ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ కామెడీ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఓటిటీ రిలీజ్ కి సంబంధించిన అనౌన్స్మెంట్స్ ఏం లేకుండా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేయడం ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠగా మారింది.
ఈ మూవీలో సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్ గా నటించింది. మురళీ శర్మ, సత్య, తాగుబోతు రమేష్ కీలక పాత్రలు పోషించారు. స్పై అంశాలకు కామెడీని జోడించి డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఇందులో చారి అనే గూఢచారిగా తన కామెడీ టైమింగ్ తో వెన్నెల కిషోర్ ఆకట్టుకున్నాడు. ఎంతటి సీరియస్ ఇష్యూను అయిన సిల్లిగా మార్చే స్పైగా వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు డైరెక్టర్. ఎన్నారై వంటి ఇన్వెస్టిగేషన్ సంస్థలు చేస్తున్న పరిశోధనలు ఫన్నీగా సినిమాలో చూపించారు. కానీ ఇది ప్రేక్షకుల్లోకి పెద్దగా వెళ్లలేదు. వెన్నెల కిషోర్ తన నటనతో కొంతవరకు మెప్పించినప్పటికీ మరికొంత డైరెక్షన్లో ఉంటుంది. ఈ సినిమాని సరైన విధంలో డైరెక్షన్ చేయకపోవడం మరియు సరైన మాటలు సమకూర్చకపోవడంతో మైనస్ గా మారింది.
నిజానికి ఈ మూవీని ఓటిటి కోసమే తెరకెక్కించినట్లు మొదట్లో ప్రచారం జరిగింది. కానీ వెన్నెల కిషోర్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని థియేటర్లలో రిలీజ్ చేసినట్లు సమాచారం. మిస్టర్ బీన్ హీరోగా నటించిన హాలీవుడ్ మూవీ జానీ ఇంగ్లీష్ స్ఫూర్తితో చారి 111 తెరకెక్కించినట్లు ప్రచారం జరిగింది. రుద్రనేత్ర పేరుతో ఆర్మీ ఆఫీసర్ ప్రసాద్ రావు నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీను ఏర్పాటు చేస్తాడు ముఖ్యమంత్రి (శుభలేఖ సుధాకర్). హైదరాబాద్లోని ఓ మాల్ లో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ కేసును రుద్రనేత్ర కు చెందిన స్పెషల్ ఏజెంట్ చారి (వెన్నెల కిషోర్) కు అప్పచెబుతారు.
సీరియస్ ఇష్యూను సిల్లీగా మరియు ఫన్నీగా చూస్తాడు చారి. ఇంతకీ ఆఖరికి చారి ఆ బాంబ్ బ్లాస్ట్ చేసిన వారిని పట్టుకున్నాడా? అసలా బాంబ్ బ్లాస్ట్ ఎందుకు చేశారు? అనే కథాంశం చుట్టూ ఈ మూవీ రూపొందింది. ఇక ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో ప్రసారమవుతుంది. ఈ మూవీ థియేటర్లో అయితే డిజాస్టర్ గా నిలిచింది. ఇక మొదట ఈ మూవీ ని ఓటిటి లోనే రిలీజ్ చేయాలి అనుకున్నారు కనుక ఇప్పుడు ఓటిటిలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటే వీరి మొదటి అంచనా నే కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. పలుకుబడిని చూసి సినిమాల ఫ్లాట్ ఫారమ్స్ ని డిసైడ్ చేయకూడదు. ఆ సినిమా కథాంశాలను చూసి ప్లాట్ఫారం డిసైడ్ చేస్తే అవి తప్పకుండా సక్సెస్ అవుతాయి. మరి వెన్నెల కిషోర్ థియేటర్లో హీరోగా అయితే ఫ్లాప్ అయ్యాడు ఓటిటిలో హిట్ అవుతాడో లేదో చూడాలి.