హైదరాబాదు: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై అర్థనగ్న ప్రదర్శన నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన సిపిఐ నేత నారాయణ నేడు ఫిరాయింపుదారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించినా రాజ్యాంగ ఉల్లంఘనేనని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేల కంటే ముంబాయి రెడ్ లైట్ ఏరియా వాళ్లే నయం అని నారాయణ విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్తో ఉంటేనే నిధులు ఇస్తామని ఇతర పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలకు కెసిఆర్ చెబుతున్నారని నారాయణ ఆరోపించారు.
previous post
next post