అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో భేటీ అయ్యారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ను ఆహ్వానించేందుకు కెసిఆర్ స్వయంగా ఇక్కడకు వచ్చారు. నేడు విజయవాడ చేరుకున్న కెసిఆర్ ముందుగా దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం నేరుగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్, కెటిఆర్ ఇతర నేతలకు జగన్ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఆహ్వానపత్రికను జగన్కు కెసిఆర్ అందజేసి కుటుంబ సమేతంగా హజరుకావాలని కోరారు. కెసిఆర్, కెటిఆర్ ఇతర టిఆర్ఎస్ నేతలకు జగన్ నివాసంలో విందు భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రుల ఏకాంత భేటీలో పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కెసిఆర్ వెంట టిఆర్ఎస్ ఎంపి సంతోష్కుమార్, మాజీ ఎంపి వినోద్ పాల్గొన్నారు.