రీసెంట్గా `రాగల 24 గంటల్లో` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. `రాగల 24 గంటల్లో` చిత్ర నిర్మాత శ్రీనివాస్ కానూరు నిర్మాణంలోనే తన కొత్త సినిమాను చేయబోతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరో పది మంది హీరోయిన్లు నటిస్తారట. ఈ చిత్రానికి `భార్యదేవోభవ` అనే టైటిల్ను కూడా ఖరారు చేశారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ వలే.. భార్య గొప్పతనం తెలియచేసేలా భార్యదేవోభవ ఉంటుందని త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తానని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
previous post
next post