పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా అయిన వెంటనే డైరెక్టర్ క్రిష్ ‘విరూపాక్ష’ అనే మొగలుల కాలానికి చెందిన చరిత్రాత్మక జానపద కథతో పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఇదిలా ఉండగా డైరెక్టర్ హరీష్ శంకర్ మరియు క్రిష్ కలిసి ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. అది సినిమా డైరెక్షన్ కాదనుకోండి ప్రొడక్షన్. ఇద్దరూ కలిసి ఒకపక్క దర్శకత్వం చేస్తూనే మరోవైపు సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నారట.
ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ చిన్న చిన్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నారు. దీంతో తాజాగా ఈ ఫీల్డ్ లోకి హరీష్ శంకర్ కూడా దిగినట్టు సమాచారం. త్వరలో డైరెక్టర్ క్రిష్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న సినిమా భాగస్వామ్యం లో కూడా హరీష్ శంకర్ చేతులు కలిపినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. అయితే ఒక్కసారిగా వీరిద్దరూ నిర్మాణ భాగస్వామ్యంలో చేతులు కలపడం వెనకాల పవన్ కళ్యాణ్ ప్రమేయం ఉందా అనే చర్చ టాలీవుడ్ లో పాటు మెగా అభిమానుల్లో నెలకొంది. మరోపక్క హరీష్ శంకర్ తన గురువులు పూరి జగన్నాథ్ మరియు రామ్ గోపాల్ వర్మ ఎవరికి వారు సొంత బ్యానర్లు ఉండటంతో, తనకంటూ కూడా ఒక బ్యానరు ఉండాలని ఎప్పటినుండో ఆలోచించి ఈ ఫీల్డ్ లోకి దిగినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం సినిమా ధియేటర్ లో కంటే ఓటీటీ లో వ్యాపారం ఎక్కువగా జరుగుతున్న తరుణంలో ఈ ఇద్దరు డైరెక్టర్లు వెబ్ సిరీస్ లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం.