భారతదేశంలో కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తుంది. ప్రతి రోజున కుప్పలుతెప్పలుగా కేసులు వచ్చిపడుతున్నాయి. ఇకపోతే గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 10,974 కేసులు నమోదు కాగా 2,003 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజులో ఇంత మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోవడం ఈ వైరస్ ఉదృత్తి భారత్ లో మొదలైనప్పటి నుండి ఇదే తొలిసారి.
ఇకపోతే చనిపోయిన ఆ రెండు వేల మందిలో దాదాపు 50 శాతం మంది మహారాష్ట్రలో ఉండగా మరొక పాతిక శాతం మంది 25 శాతం మంది ఢిల్లీకి చెందిన వారు కావడం గమనార్హం. అయితే ఇక్కడ భారత ప్రజలు ఊపిరి తీసుకోదగ్గ విషయం ఏమిటంటే దేశంలో కరోనా వైరస్ నుండి రికవరీ రేటు 58.4 శాతానికి పెరిగింది.
ఇప్పటివరకు వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా 3,54065 మంది ఇన్ఫెక్ట్ కాగా వారిలో 1,86,935 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఈ రికవరీ రేటు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు మరియు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.