Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ (86) కన్నుమూశారు. అనారోగ్య కారణంతో ఆయన మృతి చెందారు. సయిద్ అహ్మద్ మరణవార్తను ప్రస్తుత పీసీబీ చైర్మన్ మొహిసిన్ నఖ్వ్ క్రికెట్ ప్రపంచానికి తెలియజేశారు. డాషింగ్ బ్యాటర్ గా పేరు తెచ్చుకున్న అహ్మద్ పాక్ తరపున 41 టెస్ట్ లు ఆడి అయిదు సెంచరీలు, 16 హాఫ్ సెంచరీల సాయంతో 2991 పరుగులు చేశాడు. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన అహ్మద్ పాక్ తరపున 22 వికెట్లు పడగొట్టాడు 1958 లో వెస్టిండీస్ తో జరిగిన బ్రిడ్జ్ టౌన్ టెస్ట్ లో అరంగేట్రం చేసిన అహ్మద్ .. తన స్వల్ప కేరీర్ లో మూడు మ్యాచ్ ల్లో పాక్ కెప్టెన్ గా వ్యవహరించారు.
అహ్మద్ క్రికెట్ కేరీర్ 20 ఏళ్ల చిరు ప్రాయంలోనే నిలిచిపోయింది. 1972 -73 ఆస్ట్రేలియా పర్యటన లో అహ్మద్ తన చివరి టెస్ట్ మ్యాచ్ (మెల్ బోర్న్) ఆడారు. ఫిట్ నెస్ విషయంలో క్రికెట్ బోర్డుకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న అభియోగంతో కేరీర్ అర్ధంతరంగా ముగింపు పడింద. పాక్ దిగ్గజం హనీఫ్ ముహమ్మద్ విండీస్ పై చారిత్రక సెంచరీ (337) సాధించిన ఇన్నింగ్ లో అహ్మద్ అతని భాగస్వామిగా ఉన్నారు. ఆ ఇన్నింగ్ లో అహ్మద్ 65 పరులుగు చేశాడు.
అహ్మద్ పాక్ జాతీయ జట్టుకు ఆరో కెప్టెన్ గా వ్యవహరించారు. అహ్మద్ సారథ్యం వహించిన మూడు మ్యాచ్ లు డ్రాగా ముగిసాయి. సయిద్ అహ్మద్ సోదరుడు యునుస్ అహ్మద్ కూడా పాక్ టెస్ట్ టెస్ట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. యూనుస్ పాక్ తరపున నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడారు. 1987 లో భారత్ లో పర్యటించిన పాక్ జట్టులో యూనస్ సభ్యుడిగా ఉన్నారు. ఈ పర్యటనలో పాక్ కు ఇమ్రాన్ ఖాన్ సారథ్యం వహించారు.