Surya Kiran: ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్ కన్నుమూసిన సంగతి తెలిసింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నై హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సూర్య కిరణ్ మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించడంతో.. సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. అయితే తాజాగా సూర్య కిరణ్ మరణం వెనక ఉన్న కొన్ని సంచలన నిజాలు బయటకు వచ్చింది. 1977 సెప్టెంబర్ 6న చెన్నైలో టీ.ఎస్. మణి, రాధా దంపతులకు జన్మించిన సూర్యకిరణ్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించాడు. మాస్టర్ సురేష్ పేరుతో 200కు పైగా చిత్రాల్లో బాల నటుడిగా చేశాడు. ఎన్నో అవార్డులను అందుకున్నాడు.
అలాగే పాలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేసిన సూర్యకిరణ్.. 2003లో సత్యం మూవీ ద్వారా దర్శకుడిగా మెగా ఫోన్ పట్టాడు. ఈ చిత్రం సూర్య కిరణ్ కు మంచి గుర్తింపు తెచ్చింది. కానీ ఆ తర్వాత తీసిన ధన 51, బ్రహ్మోత్సవం, రాజు భాయ్, చాప్టర్ 6 వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. సూర్యకిరణ్ కెరీర్ ను తీవ్రంగా దెబ్బ తీశాయి. అదే సమయంలో పర్సనల్ లైఫ్లోనూ అతను ఫెయిల్ అయ్యాడు. ప్రముఖ హీరోయిన్ కల్యాణిని సూర్య కిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత వీరి బంధం కొన్నాళ్లు సాఫీగానే సాగిన.. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి.
2016లో సూర్యకిరణ్ కళ్యాణి విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ వెళ్లిపోవడానికి ఆర్థిక సమస్యలే ప్రధాన కారణమని గతంలో సూర్య కిరణ్ సోదరి, ప్రముఖ నటి సుజాత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. విడాకుల తర్వాత సూర్యకిరణ్ ఇండస్ట్రీలో కనిపించలేదు. దాదాపు ఏడేళ్లు గ్యాప్ తర్వాత 2020లో బిగ్ బాస్ సీజన్ 4లో సందడి చేశాడు. కానీ తొలి వారమే ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఆ సమయంలో సూర్య కిరణ్ ఓ ఇంటర్వ్యూలో కళ్యాణి గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
విడాకులు మా ఇద్దర్నీ వేరుచేసినా మా మనసులు మాత్రం కలిసే ఉంటాయి. ఈ జన్మకే కాదు.. ఇంకెన్ని జన్మలెత్తినా కూడా.. నా భార్య స్థానం కళ్యాణిదే అంటూ భార్యపై తన ప్రేమను బయటపెట్టారు. ఇక ఇప్పుడు ఆ ప్రేమనే ఆయన్ను మరణానికి చేరవ చేసిందని తాజాగా కరాటే కళ్యాణి బయటపెట్టింది. సూర్య కిరణ్ తో మంచి అనుబంధం ఉన్న కరాటే కళ్యాణి తాజాగా ఆయన మరణంపై విచారం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కొన్ని విషయాలు పేర్కొంది. భార్య వల్లే సూర్య కిరణ్ మరణించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న కళ్యాణి విడాకులు తీసుకుని దూరం కావడం ఆయన జీర్ణయించుకోలేకపోయాడు. మానసిక వేదనకు గురయ్యాడు. మందు, సిగరెట్స్ కు బానిసయ్యాడు. ఆ దురలవాట్లతో సూర్య కిరణ్ ఆరోగ్యం దెబ్బతింది. తాగుడు వల్ల సూర్య కిరణ్ జాండిస్ గురయ్యాడు. అందుకే మరణించాడంటూ కరాటే కళ్యాణి పేర్కొంది.