Trinayani March 12 2024 Episode 1186: శివ నైని దగ్గరికి వెళ్లి ఒక పేపర్ పెన్ను తీసుకురమ్మంటాడు.ఏంటి శివ ఇన్నాళ్ళకి కనిపిస్తున్నావు పెన్ను పేపర్ ఎందుకు అని నైని అడుగుతుంది.ఒక ఆడ చిలుకకి లవ్ లెటర్ రాయాలి అని శివ అంటాడు.నీలో ఆ కళ కూడా ఉందా అని నైని అంటుంది. చెప్పింది చెయ్ తల్లి ఇంకేమీ అడగకు అని శివ అంటాడు. నైని పెన్ను పేపరు తీసుకువస్తుంది. ఏమీ మాట్లాడకు గోడకు చెవులే కాదు టెక్నాలజీ కూడా ఉంది అని శివ పేపర్లో రాయమంటాడు. ఆ పేపర్ ని మలిచి అగ్గిపెట్టెలో పెట్టమంటాడు శివ. పేపర్ ని అగ్గిపెట్టెలో మలిచి పెడుతుంది నైని. ఆ పేపర్ తీసుకొని శివ ఎగిరిపోతాడు. కట్ చేస్తే. వదిన మా అమ్మ గురించి సుమనకి ఏం తెలిసిందో నాకు తెలియదు కానీ ఇలా పేపర్లో ఎందుకు వేయించిందంటావు అని విశాల్ అంటాడు.
అదే నాకు అర్థం కావట్లేదు విశాల్ అని హాసిని అంటుంది. మమ్మీ నా పెళ్ళానికి కూడా నిజం తెలుసా అని వల్లభ అంటాడు. ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు విందాం ముందు అని తిలోత్తమ అంటుంది. విశాల్ హాసిని మాట్లాడుకుంటూ ఉండగా శివ వచ్చి ఆగిపెట్టిలోన పేపర్ ని కింద పడేస్తాడు. అది చూసిన విశాల్ తీసి ఆ పేపర్ ని చదువుతాడు. పేపర్ ను చదివిన విశాల్ హాసిని మాట్లాడకుండా పేపర్ ని చదవమని ఇస్తాడు. ఆ పేపర్ ని చదివిన హాసిని షాక్ అవుతుంది. ఇప్పుడేం చేద్దాం అని హాసిని అంటుంది. శివ మైక్ మైక్ ఉన్న దగ్గరికి వెళ్లి నిలబడతాడు. విశాల్ ఆ మైక్ ను చూసి కింద పెట్టి వదిన టాపిక్ ని డైవర్ట్ చేసి మాట్లాడాలి అని అంటాడు. ఇది తిలోలోత్తమ అత్తయ్య వాళ్ళ పని అంటావా అని హాసిని అంటుంది. థాంక్యూ శివ అని విశాల్ అంటాడు. అవును వదిన నన్ను కన్న తల్లి ఎక్కడ ఉందో ఏమో నన్ను చూడడానికి రావట్లేదు తెలుసా అని విశాల్ అంటాడు. అమ్మ విశాల్శాల్ కి కూడా వాళ్ళ అమ్మ గురించి తెలియదు అని వల్లభ అంటాడు.
సుమనకి ఏమీ తెలియకుండా పేపర్లో వేయించింది అని తిలోత్తమ అంటుంది. విశాల్ ఏమి ఆలోచించకుండా పడుకో అని హాసిని చెబుతుంది. జై బోలో గణేష్ మహరాజ్ కి అని శివ అంటాడు.మైక్ అంటించగానే బ్లాస్ట్ అవుతుంది తిలోత్తమ వల్లభ చెవిలో నుంచి రక్తం వస్తుంది. కట్ చేస్తే, విశాల్ గాయత్రీ పాపను ఎత్తుకొని అమ్మ నువ్వే పెద్దయ్యాక ఎలా ఉంటావో తెలుసా ఇదిగో ఫోటోలో ఉన్న అమ్మలాగే ఉంటావు నువ్వే మా అమ్మవని నేను నిన్ను కన్నానని నాకు హాసిని వదినకి పావన మూర్తి మావయ్యకి తప్ప ఇంకెవరికీ తెలియదు అని విశాల్ మాట్లాడుతూ ఉంటాడు. తిలోత్తమ మెట్లు దిగుతూ కిందికి వస్తుంది అది చూసిన హాసిని చెంబు తీసుకొని కింద విసిరేస్తుంది. ఆ సౌండ్ విన్న విశాల్ వెనుకకు తిరిగి చూసేసరికి తిలోత్తమ కనబడుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ విశాల్ అని తిలోత్తమ అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ తమ్మి గట్టిగా చెప్పు అని వల్లభ అంటాడు
రేయ్ విశాల్ అనుకున్నాను నువ్వు కూడా సరిగ్గా చెప్పవెందుకు అని తిలోత్తమ అంటుంది. అమ్మ నువ్వు కూడా మాట్లాడట్లేదు పెదాలు ఆడిస్తున్నావ్ అని వల్లభ అంటాడు. వాళ్లకి చెవులు వినిపించట్లేదు అని డమ్మక్క అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ మాకు అర్థం కావట్లేదు అని పావన మూర్తి అంటాడు.నాకు అర్థమైంది బాబాయ్ అని హాసిని నవ్వుతుంది. వదిన పరిస్థితి ఏంటో అర్థం అవుతుందా నవ్వకు అని విశాల్ అంటాడు. అక్క విషయం చెప్పాక నవ్వు అని నైని అంటుంది. మా ఆయనకి మా అత్తయ్యకి చెవులు వినిపించట్లేదు అని హాసిని అంటుంది.వదిన చెవులు వినిపించట్లేదా అని చెవులో వేలుపెడుతుంది దురంధర. ఇద్దరికీ ఒకేసారి చెవులు వినిపించకపోవడం ఏంటి అని పావనమూర్తి అంటాడు. గోడకి చెవులు ఉంటాయని ఏ పాడు పని చేయబోయారు అందుకే ఇలా అయ్యింది అని విక్రాంత్ అంటాడు.
మాకు చెవులు వినపడట్లేదని హాసిని ఎగతాళి చేయొద్దని చెప్పు అని తిలోత్తమ అంటుంది.వీళ్ళని ఇప్పుడు ఎన్ని తిట్టినావినపడదు అని హాసిని అంటుంది. ఏం మాట్లాడుతున్నావే అని వల్లభ అంటాడు. అక్క వినపడితే అప్పుడు మన పని అయిపోతుంది అని సుమన అంటుంది. ఏమి వినిపించదు లే సుమన మనసులో ఏమీ పెట్టుకోకుండా తిట్టేసేయ్ అని హాసిని అంటుంది. నీ మంచికే చెప్తున్నాను అక్క అని సుమన అంటుంది. మనం ఎంత చెప్పుకున్నా అమ్మ వాళ్లకి వినిపించదు అని విశాల్ అంటాడు. అమ్మ హాస్పిటల్ కి వెళ్దాం పద అని వల్లభ అంటాడు. ఏమంటున్నావ్ రా అని తిలోత్తమ అంటుంది. బ్రో వినిపిస్తుందా అని విక్రాంత్ అంటాడు. హాస్పిటల్ కి తీసుకు వెళ్లి రకరకాల టెస్టులు చేస్తే చెవులు నిజంగానే కరాబ్ అవుతాయి అందుకే వెల్లుల్లిలో నూనె పోసి వేడి చేసుకుని వచ్చాను ఇది రెండు రోజులు వాడితే తగ్గిపోతాయి అని నైని చెబుతుంది. ఇప్పుడు ఈ విషయం వదిన వాళ్లకి ఎలా చెప్పడం అని దురంధర అంటుంది. సైగ చేస్తే సరిపోతుంది అని పావనమూర్త చప్పట్లు కొట్టి రా అక్కాయ్ అని అంటాడు. ఏమి వినపడని తిలోత్తమ అపార్థం చేసుకొని పావన మూర్తి చెంప పగలగొడుతుంది.సైగల కూడా అర్థం కావట్లేదు అని సుమన అంటుంది.
ఏదైనా పేపర్ మీద రాయండి అని విక్రాంత్ అంటాడు. నేను చెప్తాను అని విశాల్ అమ్మ మీరు డాక్టర్ దగ్గరికి ఇప్పుడు వెళ్లిన లాభం లేదు ఆయిల్ నైని వేడి చేసుకొచ్చింది చెవిలో పోసి కాటన్ పడితే నయమైపోతుంది అని విశాల్ అంటాడు. అలాగే కానివ్వండి అని తిలోత్తమ అంటుంది. పెంచిన కొడుకు కాబట్టి అమ్మకి అర్థమయ్యేలా చేశాడు అని డమ్మక్క అంటుంది. హాసిని తిలోత్తమ తల వంచుతుంది సుమన చెవిలో నూనె పోసి దూది పెడుతుంది. ఇన్ఫెక్షన్ అయ్యి శాశ్వతంగా చెవులు వినపడకుండా పోవు కదా అని వల్లభ అంటాడు. విక్రాంత్ వల్లభాని బలవంతంగా వంగబెట్టి చెవులో నూనె వేసి దూది పెడతాడు. మీరు రండి అమ్మ మిమ్మల్ని నిదానంగా తీసుకు వెళ్తాను అని డమ్మక్క అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!