Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ రసవత్తరంగా సాగుతోంది. 9వ వారం ఆట కూడా చివరికి వచ్చేసింది. శుక్రవారం ఎపిసోడ్ పూర్తి కావడంతో.. నామినేషన్ లో మొత్తం 8 మంది ఉండగా ఈసారి.. ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 9వ వారం గేమ్ చాలా టాఫ్ గా సాగింది. హౌస్ లో అందరూ చాలా బాగా ఆడారు. దీంతో పోలింగ్ కూడా చాలా రసవత్తరంగా బయట జరిగింది. అయితే ఆన్ అఫీషియల్ పోలింగ్ సైట్ బట్టి చూస్తే యావర్ అందరికంటే ఎక్కువ ఓట్లు సాధించి టాప్ లో ఉన్నాడు. రెండో స్థానంలో అమర్, మూడో స్థానంలో బోలే ఉండటం జరిగింది. ఇక మిగతా ఐదుగురిలో ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
వాళ్ళిద్దరూ మరెవరో కాదు టేస్టీ తేజ, శోభా శెట్టి. 8 మందిలో ఇద్దరు ఓటింగ్ పరంగా చివరిలో ఉన్నారు. వీళ్ళకంటే పైనే మెరుగైన స్థానాలలో అర్జున్, ప్రియాంక, రతిక ఉండటం జరిగింది. ఇదిలా ఉంటే ఈసారి 9వ వారంలో డబల్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు బయట ప్రచారం జరుగుతుంది. ఒక మేలు కంటెస్టెంట్ తో పాటు మరొక ఫిమేల్ కంటెస్టెంట్ పంపించే రీతిలో ఆలోచన చేస్తున్నట్లు దీంతో టేస్టీ తేజ, శోభ ఇద్దరు కూడా హౌస్ నుండి వెళ్లిపోయే అవకాశాలున్నట్లు బయట డిస్కషన్ జరుగుతుంది.
ఇదిలా ఉంటే మరోపక్క తొమ్మిదో వారం కెప్టెన్సీ టాస్క్ లో శోభా శెట్టి గెలవడం జరిగింది. సో ఆమె కొద్దిగా ఇమ్యూనిటీ పొందుకోవటంతో.. ఆమె హౌస్ నుండి వెళ్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా ఉంది. బిగ్బాస్ ఈవారం ఇమ్యూనిటీ ఇవ్వకుండా ఓన్లీ వచ్చేవారు మాత్రమే ఇమ్యూనిటీని పరిగణలోకి తీసుకుంటే శోభా శెట్టి కెప్టెన్సీ తో పాటుగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే టేస్టీ తేజ శోభ ఇద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నట్లు బయట టాక్.