Nindu Noorella Saavasam February 1 2024 Episode 148: రాథోడ్ వెళ్ళాడు కదా పంతులు గారిని తీసుకురావడానికి వచ్చాక నీకు కూడా క్లారిటీ వస్తుంది అని మనోహరి అంటుంది. ఏంటమ్మ ఈసారి చాలా సంతోషంగా ఉన్నారు అని నీలా అంటుంది. ఈసారి గెలుపు నాదే ఆట నాదే అని మనోహరి అంటుంది. అరుంధతి అమ్మగారికి ఈవిడ విషయం తెలియక నమ్మారు పాపం అని నీలా అనుకుంటుంది. కట్ చేస్తే, పిల్లలు స్కూల్ నుంచి డైరెక్ట్ గా హాస్పిటల్ కి వచ్చి రిసెప్షన్ దగ్గర అడిగి రామ్మూర్తిని చూడడానికి వెళ్తారు. పిల్లల్ని చూసిన ఖాళీ వాళ్ళు వస్తున్నారు అక్క అని అంటాడు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని మంగళ అంటుంది. నాకు అర్థం కావట్లేదు అక్క అని ఖాళీ అంటాడు. భాగీకి పెళ్లయిందాకా వీళ్లను ముసలోనికి తెలియకూడదు లేదంటే పిల్లలకు నిజం తెలిసిపోతుంది అని మంగళ అంటుంది. పిల్లల్ని చూసి అరుంధతి పిల్లలు మీరెందుకు వచ్చారు మీ వెంట ఎవరైనా వచ్చారా అని అడుగుతుంది. పిల్లలు లోపలికి వెళ్తూ ఉండగా మీరు వెళ్లడానికి వీల్లేదు బయటికి వెళ్ళండి అని మంగళ అంటుంది.
మేము తాతని చూడడానికి వచ్చాము చూశాక వెళ్ళిపోతాం అని అమృత అంటుంది. డాక్టర్ గారు ఎవరిని చూడొద్దని చెప్పాడు మీరు వెళ్ళండి అని ఖాళీ అంటాడు. దూరం నుంచి అయినా చూసి వెళ్ళిపోతాం అని ఆకాష్ అంటాడు. పిల్లలు వెళ్లిపోతారా మీ నాన్నకి ఫోన్ చేయమంటారా అని మంగళ అంటుంది. అయ్యో వద్దండి మా నాన్నకి తెలియకుండా వచ్చాము అని పిల్లలు అంటారు. వెళ్ళిపోతారా మీ డాడీకి ఫోన్ చేయమా అని బెదిరించగానే పిల్లలు భయపడి పోయి వెళ్ళిపోతారు. స్కూల్లో మేనేజ్ చేసి ఇంత దూరం వస్తే వేస్ట్ అయిపోయింది అని అమృత అంటుంది. లేదు అక్క వాళ్ళు ఎప్పుడు అక్కడే కూర్చుంటారా వాళ్ళు పక్కకి వెళ్ళినప్పుడు మనం వెళ్లి చూద్దాం అని అంజలి అంటుంది. పదండి గోడ చాటు నుండి చూద్దాం అని అమృత అంటుంది. కట్ చేస్తే, ఏమండీ ఒకసారి వెళ్లి మిస్సమ్మ వాళ్ళ నాన్నను చూద్దామా అని నిర్మల అంటుంది. వద్దు నిర్మల అమర్ కి తెలిస్తే బాధపడతాడు అని శివరాం అంటాడు. ఇంతలో రాథోడ్ పంతులు గారిని తీసుకొని వస్తాడు. పంతులుగారు మనోహరికి మంచి సంబంధం చూసి పెట్టండి అని అమరేంద్ర అంటాడు.
పంతులుగారు పెళ్లి కొడుకు ఫోటో చూపెట్టి ఇతను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అమ్మ నాన్నలకు ఒక్కడే కొడుకు అని పంతులు అంటాడు. మనోహరికి నీకు నచ్చితే చెప్పు పెళ్లి చేద్దాం అని అమరేంద్ర అంటాడు. నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న నాకంటే నీకే తెలుసు నువ్వే సెలెక్ట్ చెయ్ అని మనోహరి అంటుంది. ఇదేంటి అయ్యగారిని ప్రేమిస్తున్నాను అని చెప్పి పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు పెళ్లి కొడుకుని సెలెక్ట్ చేయమని చెప్తుంది అని నీలా అనుకుంటుంది. అమరేంద్ర అన్ని ఫొటోస్ చూస్తూ ఉంటాడు అందులో ఒక ఫోటో సెలెక్ట్ చేసి ఈ అబ్బాయి ఫ్యామిలీతో మాట్లాడాలి అరెంజ్ చేయండి అని చెప్తాడు. అమర్ నువ్వు తప్పు చేస్తున్నావ్ రా పిల్లల కోసం అంత కష్టపడిన మనిషిని వదిలేసి ఇక్కడ పెళ్లి సంబంధాలు మాట్లాడడం భావ్యం కాదురా తప్పు చేస్తున్నావ్ అని శివరాం అంటాడు. ఇంకోసారి ఈ టాపిక్ తీసుకురావద్దు కావాలంటే మీరు వెళ్లి కలవండి అని అమరేంద్ర అంటాడు. నేను వాళ్లతో మాట్లాడి మీకు కబురు పెడతానండి అని పంతులు వెళ్ళిపోతాడు.
మనోహరి బయటికి వచ్చి పంతులు గారికి డబ్బులు ఇచ్చి పెళ్లి చెడగొట్టమని చెబుతుంది. డబ్బులు ఇచ్చి పెళ్లి చేయమనే వాళ్ళని చూశాను కానీ ఇలా చెడగొట్టమని డబ్బులు ఇచ్చే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను అని పంతులుగారు అంటారు. ఎక్కడ ఉంటే సంతోషంగా ఉంటాను నాకు తెలుసు కాబట్టి నీకు ఈ డబ్బులు ఇచ్చి పెళ్లి చెడగొట్టమంటున్నాను మీరు చెప్పిన పని చేయండి అని మనోహరి అంటుంది. పెళ్లి చేయడం అంటే కష్టం కానీ చెడగొట్టడం అంటే సులభమే కదా అని పంతులు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. మీ తెలివికి హాట్సోఫ్ మేడం మీరు అనుకున్నది సాధించారు అని నీలా అంటుంది. ఇక ఇంట్లో కుడికాలు పెట్టడమే ఆలస్యం అని మనోహరి అంటుంది. కట్ చేస్తే, నర్సు వచ్చి ఈ మెడిసిన్ తీసుకురమ్మని భాగమతికి ఇస్తుంది.భాగమతి వెళుతుండగా నేను వస్తాను భాగి నువ్వు ఇక్కడే ఉండరా ఖాళీ అని భాగమతిని తీసుకొని వెళుతుంది మంగళ. ఖాళీ ఫోన్ మాట్లాడుతూ ఉండగా పిల్లలు ఇదే కరెక్ట్ టైం పదండి వెళ్దాం అని రామ్మూర్తి దగ్గరికి వెళ్తారు పిల్లలు. తాతయ్య అని అంజలి పిలవగానే స్పృహలోకి వస్తాడు రామ్మూర్తి. తాతయ్య మీరు ఎందుకు ఇలా అయిపోయారు అని అమృత అడుగుతుంది. మీరు స్కూల్లో కనపడ పోయేసరికి మేము ఎంత భయపడ్డామో తెలుసా తాతయ్య అని అంజలి ఏడుస్తుంది.
పిల్లల కోరికలు దేవుడు వింటాడని మా అమ్మ చెప్పేది తాతయ్య మీకు నయం అయ్యేదాకా దేవుడికి దండం పెట్టుకుంటాం తాతయ్య అని అమృత అంటుంది. మిమ్మల్ని ఇలా హాస్పిటల్ లో చూడలేకపోతున్నాను తాతయ్య మా కోసం కోలుకొని స్కూల్ కి వచ్చేయండి అని ఆనంద్ అంటాడు. మీకోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం అని ఆకాష్ అంటాడు. మా అమ్మతో మేము ఉంటే ఎలా ఉంటామో నీతో కూడా అలాగే ఆనందంగా ఉంటాం తాతయ్య కానీ అమ్మలాగే మీరు కూడా వెళ్ళిపోతారా అని అంజలి బాధపడుతుంది. అంజలి ఆ మాట అనగానే అరుంధతి బాధపడుతుంది. రామ్మూర్తి చూస్తూ వాళ్ళ మాటలు వినడం తప్ప ఏమీ మాట్లాడలేని పరిస్థితి. రామ్మూర్తి తన చేయిని తీసి అంజలి చేయి మీద పెడతాడు.తాతయ్య మన కోసం తిరిగి వస్తానని నాకు మాట ఇచ్చాడు మనం అంటే ఇష్టం కాబట్టి మన కోసం వచ్చేస్తాడు అని అంజలి అంటుంది.
వెళ్ళొస్తాను తాతయ్య రెస్ట్ తీసుకో అని పిల్లలు వెళ్ళిపోతారు.పిల్లలు బయటికి వస్తూ ఉండగా ఖాళీ చూసి మీరు ఇక్కడికి ఎప్పుడొచ్చారు అని అంటాడు వాళ్లు అతన్ని చూసి పారిపోతారు. అలా పరిగెత్తుతున్న పిల్లలు భాగమతికి ఎదురుపడతారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని భాగమతి అడుగుతుంది. మిస్సమ్మ నేను ఇక్కడికి వచ్చినట్టు నాన్నకు చెప్పకు అని అమృత అంటుంది. అది చూడ్డానికి వచ్చి ఉంటారు అని మంగళ అంటుంది. డాడీకి తెలిస్తే ఎంత కోప్పడతారు నీకు తెలుసు కదా అని భాగమతి అంటుంది. సరే తాతని చూసాం కదా మేము వెళ్ళిపోతాంలే అని అంజలి అంటుంది. తాతయ్య అంటున్నారు అని భాగమతి అంటుంది.తాతయ్య అంటే వయసు అయిపోయింది కదా అలా పిలిచి ఉంటారు వెళ్ళండి వెళ్ళండి త్వరగా అని మంగళ వాళ్ళని పంపించేస్తుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!