Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే 7వ తారీకు అర్ధరాత్రి 12 గంటల తరువాత ఆహా ఓటీటీలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ ఇప్పటివరకు ఈ మూవీ రాకపోవడంతో ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. అంజలి నటించిన ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ తేదీని ఆహానే ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. నార్మల్గా ఓటీటీలోకి వచ్చే సినిమాలు అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ మొదలవుతాయి. అలా కాదంటే ప్రత్యేకంగా సదరు ఓటీటీలు ఈ సినిమాస్ ట్రైనింగ్ ప్రారంభమయ్యే సమయం కూడా చెబుతారు. ఇక ఈ మధ్య ఆహా ఓటీడీ కూడా ప్రేమలు మూవీ ఉదయం 6 గంటల నుంచి వస్తుందని చెప్పింది.
కానీ గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఈ మూవీ బుధవారం అనగా మే 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని రెండు రోజుల కింద ఆహా తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. దీంతో రాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుందని భావించారు ప్రతి ఒక్కరు. కానీ మధ్యాహ్నం దాటినా సినిమా మాత్రం ఓటీటీలోకి రాలేదు. రాత్రి 9 గంటలకు ప్రారంభం అవుతుందేమో అన్న చర్చ జరుగుతుంది. గతంలో కొన్ని సినిమాలను ఆహా అలాగే రాత్రి సమయంలో స్ట్రీమింగ్ చేసింది. అయితే దీనిపై ఆహా ఓటి నుంచి మాత్రం ఎటువంటి అధికారక ప్రకటన మాత్రం రాలేదు.
వాళ్ల ఎక్స్ అకౌంట్లో టాప్ లోనే ఈ గీతాంజలి మళ్లీ వచ్చింది ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిన్ చేసి ఉంచారు. కానీ అందులో టైం మాత్రం వెల్లడించలేదు. మరి కొత్త అనౌన్స్మెంట్ కూడా రాలేదు. గీతాంజలి మరియు శ్రీనివాస్ రెడ్డి నటించిన గీతాంజలి మూవీకి సీక్వెళ్లే ఈ గీతాంజలి మళ్లీ వచ్చింది. మొదటి సినిమా హారర్ కామెడీ జోనర్ లో బాగానే ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ ఈ సీక్వెల్ మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించ లేక పోయింది.
ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆచరించలేదు. దీంతో నెల రోజులలోపే ఈ మూవీ ఓటిటి లోకి వచ్చేస్తుంది. నిజానికి ఈ సినిమా మే పది నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వస్తుందని మొదట వార్తలు వచ్చాయి. కానీ తర్వాత డేట్ తో పాటు ప్లాట్ఫారం కూడా మారిపోయింది. ఆహా ఓటిటి నే అధికారికంగా చెప్పడం తో పుకార్లకు తెరపడింది. అయితే వెయిటింగ్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. కామెడీ హారర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకు శివ తోర్లపాటి దర్శకత్వం వహించారు. ఈ మూవీ తో ఆయన టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఎంవీవి సినిమాస్తో కలిసి కోన ఫిలిమ్స్ కార్పొరేషన్ పై కోన వెంకట్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందించారు.
Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!