పనబాక లక్ష్మి. కేంద్ర మాజీ మంత్రి, పూర్వ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు. 2019కి ముందు ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు తిరుపతి పార్లమెంటు స్థానాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు పువ్వుల్లో పెట్టి అప్పగించారు. అయితే.. ఆమె అక్కడ ఓడిపోయారు. మళ్లీ కూడా.. పార్టీ ఆమెకు ఉప ఎన్నికల్లో నూ అవకాశం ఇచ్చింది. అప్పుడు కూడా పనబాక పరాజయం పాలయ్యారు. ఇక, ఇప్పుడు తిరుపతిలో టీడీపీ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసింది. మహిళా నాయకురాలికి ప్రకటించింది.
దీంతో పనబాక చూపు ఇప్పుడు.. బాపట్లపై పడింది. ఎస్సీ పార్లమెంటు నియెజకవర్గం అయిన.. బాపట్లలో పోటీకి తాను సిద్ధమని చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికి రెండు సార్లు.. పార్టీ అధినేతదృష్టికి తీసు కువచ్చారు. గతంలో ఇక్కడ గెలిచి ఉండడం.. ఇప్పుడు కూడా గెలుస్తాననే నమ్మకంగా చెప్పడంతో చం ద్రబాబు ఆమె పేరును పరిశీలిస్తున్నారు. కానీ, వైసీపీ ఇచ్చే టికెట్ ఆధారంగా ఇక్కడ నిర్ణయం ఉంటుంద ని నిర్ణయానికి వచ్చారు.
ఒక్క ఈ విషయమే కాకుండా.. బాపట్లలో పోటీకి మరో ఇద్దరు ఎస్సీ నాయకులు కూడా రెడీగా ఉండడం.. టీడీపీలో ఈ టికెట్ను హాట్హాట్గా మార్చేసింది. మాజీ ఎంపీ శ్రీరాం మాల్యాద్రి పేరును కూడా పార్టీ పరిశీలిస్తోంది. ఆర్థికంగాబలంగా ఉండడంతోపాటు.. గట్టి పోటీ ఇస్తారనే వాదన ఉంది. అయితే.. ఆయన కు నియోజకవర్గంలో ఉండరనే బ్యాడ్ నేమ్ ఉండడం గమనార్హం. దీంతో ఇది మైనస్గా మారింది. ఈ ఒక్క విషయం తప్పిస్తే.. మాల్యాద్రికి టికెట్ ఇవ్వొచ్చనే వాదన వినిపిస్తోంది.
మరోవైపు అనంతపురం జిల్లా శింగనమల టికెట్ దక్కని ఎస్సీ నేత, టీడీపీ ఫైర్ బ్రాండ్.. ఎం.ఎస్ రాజు పేరు కూడా.. పరిశీలిస్తున్నారు. ఈయన పార్టీని బలోపేతం చేయడంలోనూ.. ఎస్సీ సామాజిక వర్గంలో పార్టీని నిలబెట్టేందుకు కృషి చేశారు. గడిచిన మూడేళ్లుగా అనేక కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఈ నేపథ్యంలో రాజును కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పనబాకను ఈ దఫా పక్కన పెట్టే అవకాశం ఉందని పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న టాక్. మరి ఎవరికి కేటాయిస్తారో చూడాలి.