`ఎన్నికల సమయంలో ఇవన్నీ కామన్..` ఇదీ.. తాజాగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్య. తాడేపల్లి వర్గాల మ ధ్య జరుగుతున్నచర్చలను బట్టి.. సీఎం జగన్ వచ్చే ఎన్నికలపై పక్కా వ్యూహంతో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కీలకమైన రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. బీజేపీ టీడీపీ-జనసేన మిత్రపక్షంతో జట్టు కట్టడం.. దాదాపు ఖాయమైంది. అయితే.. ఇది వైసీపీకి మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? అనేది చూస్తే.. దీనిపై సీఎం జగన్మాత్రం కామనేని అంటున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఇప్పటికే.. నెల్లూరులో కీలకమైన రెడ్డి సామాజిక వర్గం నేతలు.. పార్టీకి దూరమయ్యారు. మరోవైపు.. బీజేపీ తోడు ఉంటుందని భావించినా.. ఎన్నికల సమయంలో ఆ పార్టీ కూడా తన దారి తాను చూసుకుంటోంది. ఇంకోవైపు.. సొంత సోదరి షర్మిల కాంగ్రెస్ను భుజాన వేసుకుని ఊరూరు తిరుగుతున్నారు. ఇక, ప్రతిప క్షాల నుంచి భారీ స్థాయిలో ప్రచారాలు.. మాటలు.. సవాళ్లు ప్రతిసవాళ్లు కామన్గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరకంగా వైసీపీ ఉక్కిరిబికిరికి గురవుతోంది.
క్షేత్రస్థాయిలో నాయకులు కూడా.. పెద్ద ఎత్తున ఈ విషయంపై చర్చిస్తున్నారు. `ముప్పేట దాడి.. మును గుతామో తేలుతామో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి? ` అనేది పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఒకరకంగా నాయకులు మాత్రమే కాదు.. మంత్రులస్థాయిలో కూడా ఇదే చర్చ సాగుతోంది. అయినా కూడా సీఎం జగన్ మౌనంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇవన్నీ కామనేనని ఆయన చెబుతున్నట్టు తాడేపల్లి వర్గాలు అంటున్నాయి.
ఏంటి భరోసా? అనేది చూస్తే..`విశ్వసనీయత` అనేది సీఎం జగన్ నమ్ముతున్న అంశంగా చెబుతున్నా రు. తాము అమలు చేస్తున్న సంక్షేమాన్ని ఇంకెవరూ ఇవ్వరని.. ఎవరినీ ప్రజలు నమ్మబోరని ఆయన బాగా విశ్వసిస్తున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఈ విశ్వసనీయతపైనా అనేక సందేహాలు ఉన్నాయి. కీలకమైన ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం, విశాఖ రైల్వే జోన్ వంటి హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. అయినప్పటికీ.. సీఎం జగన్ మాత్రం ప్రతిపక్షాలను లైట్ తీసుకుంటున్నారనేది తాడేపల్లి వర్గాల మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.