Madhuranagarilo February 14 2024 Episode 287: ఇప్పుడు అంటే బాంబ్ వల్ల తప్పించుకున్నావు కానీ మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిస్తే ఏం చేస్తావు అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు జాగ్రత్త పడాలి రాదా అని రుక్మిణి అంటుంది. శ్యామ్ సార్ అలా ఏం ప్రవర్తించడు లేక్క అని రాదా అంటుంది. అలా ఎందుకు అనుకుంటావ్ రాదా శ్యామ్ నిన్ను ఇంట్లో నుంచి పంపించకుండా ఉండడానికి ఏదైనా చేస్తాడు అందుకే ఒంటరిగా శ్యామ్ తో ఎక్కడికి వెళ్ళకు వెళ్లాల్సి వస్తే నాకు చెప్పు రాదా అని రుక్మిణి అంటుంది. కట్ చేస్తే, రాధా పండును తీసుకుని కూరగాయల మార్కెట్ కు వస్తుంది. అక్కడ ఒక ఇద్దరు పండును కోపంగా చూస్తూ ఉంటారు. మమ్మీ చూడు వాళ్ళు నన్ను కోపంగా చూస్తున్నారు ఇక్కడ మనం ఉండొద్దు వెళ్ళిపోదాం పద మమ్మీ అని పండు భయపడతాడు. ఎవరున్నారు నాన్న ఇక్కడ అని రాదా అటు ఇటు చూసి ఎవరు లేరు కదా ఎందుకు భయపడుతున్నావ్ అని అంటుంది.
ఇక్కడే చూశాను వాళ్ళిక్కడే ఉండాలి అని పండు అంటాడు. శ్యామ్ సార్ ని అక్క ని కలపాలంటే ముందు పండు ని దగ్గర చేయాలి అక్కకి అని రాదా ఆలోచించి రుక్మిణికి ఫోన్ చేసి మార్కెట్ కి రమ్మని చెబుతుంది. రుక్మిణి వచ్చి నన్ను మార్కెట్కి ఎందుకు రమ్మన్నావు రాదా అని అడుగుతుంది. నువ్వు శ్యామ్ సార్ కి దగ్గర కావాలంటే ముందు పండుగ నీకు దగ్గర కావాలి ఆ తర్వాతే శ్యామ్ సార్ నికు దగ్గరవుతారు అని రాదా అంటుంది. నీ పిచ్చి గాని పండు నాకు దగ్గరవుతే శ్యామ్ నాకెలా దగ్గరవుతాడు రాదా నువ్వు ఇంట్లో ఉండగా అని రుక్మిణి అంటుంది.నేను చెప్పినట్టు చేస్తే పండు నీకు దగ్గరవుతాడు అక్క అని రాధా అంటుంది. కట్ చేస్తే, అమ్మ రాధా ఎక్కడికెళ్ళింది అని శ్యామ్ అంటాడు. నాక్కూడా తెలియదు రా అని మధుర అంటుంది. రాధ కోసం ఫ్రూట్స్ తెచ్చానమ్మా రాదని పిలుస్తాను ఉండు అని రాధా రాధా అని పిలుస్తాడు. ఇంట్లో మీక్కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్లిందమ్మా? రుక్మిణి ఉందా అని శ్యామ్ అడుగుతాడు. ముగ్గురు కనిపించట్లేదు రా అని మధుర అంటుంది.
అదేంటమ్మా నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తారుఅని శ్యామ్ అంటాడు.రాధా పండుని తీసుకుని కూరగాయలకు మార్కెట్ కి వెళ్ళింది శ్యామ్ అని దాక్షాయిని చెబుతుంది. అమ్మకు చెప్పకుండా కూరగాయలకు వెళ్లడమేంటి అత్తయ్య అని శ్యామ్ అంటాడు. నాకు చెప్పి వెళ్ళింది కదరా చాలదా మీ అమ్మ కూడా చెప్పాలా కూరగాయలు మార్కెట్ కి వెళ్తే అని దాక్షాయిని అంటుంది. అది కాదు అత్తయ్య రాదా ఇప్పుడు కడుపుతో ఉంది కదా అలా వెళ్తే ఎలా అని శ్యామ్ అంటాడు. రాధా కూరగాయల మార్కెట్ కి వెళ్ళింది మరి రుక్మి ఎక్కడికి వెళ్ళింది అని శ్యామ్ అంటాడు. రుక్మిణి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు రా అని దాక్షాయిని అంటుంది. ముగ్గురూ కలిసి ఎక్కడికి వెళ్లి ఉంటారు అని శ్యామ్ ఆలోచిస్తూ ఉంటాడు.కట్ చేస్తే,నువ్వు చెప్పింది బాగానే ఉంది రాదా? పండు నాకు ఎలా దగ్గరవుతాడు అని రుక్మిణి అడుగుతుంది.
అక్కడ ఒక ఇద్దరు ఉన్నారు చూసావా అక్క వాళ్ళిద్దరూ పండును కిడ్నాప్ చేస్తారు నువ్వు వెళ్లే కాపాడితే పండు నీకు దగ్గరవుతాడు నేను చేయలేనిది నువ్వు చేసినప్పుడు నీకు దగ్గరవుతాడు కదా అని రాదా అంటుంది. నువ్వు చెప్పింది బాగానే ఉంది రాధ కానీ వాళ్ళు చూడు ఎలా ఉన్నారో ఈ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందంటావా అని రుక్మిణి అంటుంది. నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా అవుతుంది అక్క అని రాధా పండుని పిలిచి పండు నువ్వు పెద్దమ్మ దగ్గర ఉండి కూరగాయలు తీసుకో నేను వెళ్లి ఫ్రూట్స్ తెస్తాను అని రాదా అంటుంది. నేను కూడా వస్తాను మమ్మీ అని పండు అంటాడు. అక్కడ రష్ బాగుంది నాన్న నువ్వు చిన్నపిల్లాడివి కదా వద్దు నేను వెళ్లి తీసుకు వస్తాను అని రాదా అంటుంది. రష్ బాగా ఉంది అంటున్నావు కదా అమ్మ నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అని పండు అంటాడు.
పండు మనిద్దరం కూరగాయలు చూద్దాం రా అని పండుని తీసుకొని కూరగాయలు మార్కెట్ లో తిరుగుతూ ఉంటుంది రుక్మిణి. ఇంతలో ఆ ఇద్దరూ ఆడవాళ్లు వచ్చి పండుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. రుక్మిణి పండుని కాపాడుదామని వెళుతూ ఉండగా మనోహర్ వస్తాడు. ఏంటి రుక్మిణి ఎక్కడికి వెళ్తున్నావ్ నా నుంచి ఎన్ని రోజుల తప్పించుకుంటావ్ అని మనోహర్ అంటాడు. మనోహర్ ఇప్పుడు నన్ను వదిలిపెట్టు నేను వెళ్ళాలి అని రుక్మిణి అంటుంది. చూడు నాకెప్పుడూ డబ్బు సెటిల్ చేస్తావ్ మన విషయం ఇప్పుడు బయట పెడతావ్ నీ వెంట ఎన్ని రోజులు తిరగాలి అని మనోహర్ అంటాడు. నేనే నీకు ఫోన్ చేస్తాను నువ్వు ముందు ఇక నుంచి వెళ్ళు మా చెల్లెలు ఇక్కడే ఉంది అని రుక్మిణి అంటుంది.
కట్ చేస్తే,ఇంతలో రాధ వస్తుంది అక్క పండు ఏడి అని అడుగుతుంది. పండు ని వాళ్ళు కిడ్నాప్ చేశారా రాదా అని రుక్మిణి అంటుంది. అదేంటి అక్క నువ్వు పండు నీ కాపాడలేదా నీకు చెప్పే వెళ్లాను కదా అని రాదా అంటుంది.మనోహర్ మ్యాటర్ చెప్పకుండా నేను పండు కోసం పరిగెత్తుకుంటూ వచ్చేసరికి వాళ్ళు నాకు దొరకకుండా పారిపోయారు రాదా అని రుక్మిణి అంటుంది. ఇప్పుడు ఎలా అక్క ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాం పండు కిడ్నాప్ అయ్యాడు అని తెలిస్తే ఏం జరుగుతుంది అని రాదా బాధపడుతుంది. పండు నీ వలు ఏం చేస్తారో ఏమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది రుక్మిణి.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!