రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఏదో ఆశిస్తే.. మరేదో జరగడం రాజకీయాల్లో కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు టీడీపీకి కూడా అదే జరుగుతోందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూ లంగా మార్చుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే జనసేనతో పొత్తుకు రెడీ అయింది. ఇదే విషయాన్ని జనసేన అధినే తపవన్ కూడా చెప్పుకొస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితిలోనూ చీల్చకుండా చూస్తానని అంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఇది బాగానే ఉంది.
కానీ, అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్న దరిమిలా.. టీడీపీ, జనసేన ఆశలపై నీళ్లు జల్లుతున్న పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల.. వైసీపీపై ఒక పెద్ద పోరాటం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరుగుతుందనే అంచనాలు వస్తున్నాయి. గత 2019 ఎన్నికల సమయంలో 0.5 శాతంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఈ సారికి కనీసంలో కనీసం.. 1 శాతం పెరుగుతుందనే లెక్కలు వస్తున్నాయి. పోనీ.. ఇంతకాదన్నా.. మరో 0.5 శాతమైనా పెరుగుతుందని అంటున్నారు.
ఇదే జరిగితే.. కాంగ్రెస్ కొంత పుంజుకుంటుంది. అయితే.. ఇలా పడే.. ఆ 1 శాతం లేదా 0.5 శాతం ఓట్లు ఖచ్చితంగా వైసీపీకి చెందిన ఓటు బ్యాంకు నుంచే పడనున్నాయి. బలమైన కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఓట్లు మార్పు జరిగే అవకాశం ఉంది. ఇది కూడా.. వైసీపీ వ్యతిరేకత ఓటు బ్యాంకేనన్నది పరిశీలకుల అంచనాగా ఉంది. దీనినే టీడీపీ, జనసేన కూడా నమ్ముకుంది. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు వేరే పార్టీలకు వెళ్లకుండా.. తమవైపు తిప్పుకోవాలని భావించింది.
ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో ఈ వ్యూహానికి ఎదురు దెబ్బ తగులుతోంది. అయితే.. టీడీపీ-జనసేనకు భారీ నష్టం కలకగకపోయినా.. వ్యతిరేక ఓటును తాము దక్కించుకోలేక పోతే.. మెజారిటీల విషయంలో వైసీపీ వర్సెస్ మిత్రపక్షం మధ్య మరింత పోటీ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. దీనిని అధిగమించి.. ఏకపక్షంగా ఓట్లు రాల్చుకోవాల్సివస్తే.. టీడీపీ మరింత ఎక్కువగా కష్టపడాలని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే అనేక కార్యక్రమాలతో ముందున్న టీడీపీ ఇక, పై మరింతగా పనిచేయాల్సి ఉంది. ఏదేమైనా షర్మిల ఎంట్రీతో జగన్కు మైనస్ అవుతుందనుకుంటే అది చంద్రబాబుకే మైనస్గా మారేలా ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారుతున్నాయి.