Intinti Gruhalakshmi: కాశ్మీర్ ట్రిప్ కి తులసి వాళ్ళ ఫ్యామిలీ సెలక్ట్ అవుతుంది. లాస్య కోపంతో మండిపోతుంది. అంతలో టూర్ అనౌన్స్ చేసిన వాళ్ళు విన్నర్స్ అందరిని కలిపి ఫోటో తీస్తారు.. ఆ తర్వాత దివ్య అందరతో మన అందరం కలిసి ఒక సెల్ఫీ దిగుదాం అని అంటుంది.. ఇక వెంటనే అభి అంకితను వచ్చి తన పక్కన నుంచుని చెప్తాడు. ప్రేమ్ శృతిని పిలుస్తాడు. తులసి వాళ్ళ అత్తయ్యా, మావయ్య వాళ్ళను పిలుస్తుంది.. అందరూ కలిసి సెల్ఫీ దిగుతారు.. నందు లాస్య ను పిలవడు. దాంతో లాస్య కోపంగా అక్కడి నుంచి వెళ్లి పోతుంది.. దాంతో పెద్ద దుమారమే రేగుతోంది. నందు పై వాళ్ళ నాన్న ప్రవచనాలు చెప్పి నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది అంటాడు..
నందు ఇంటికి వస్తాడు. లాస్య నందు పై కారాలు మిరియాలు నూరుతుంది.. తనను తప్పుగా అర్థం చేసుకోవద్దు అని అంటుంది.. ఎంచక్కా.. మీ మాజీ భార్య తో సెల్ఫి దిగి వచ్చావుగా అని అంటుంది.. ఇక సెల్ఫీ దిగడానికి తనని పిలవ లేదని బాధగా అడుగుతుంది.. నీకు నీ వాళ్ళు అంతా ఉంటారు కానీ.. నాకు ఉన్నది నువ్వు ఒక్కడివే.. నువ్వే నా లోకం.. ఐయమ్ సారీ లాస్య.. ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని అంటాడు నందు.!
అంకిత అభి దగ్గరకు వెళ్లి మనీ ఇవ్వమని అడుగుతాడు. అంతలో అంకిత చెక్ ఇస్తుంది. ఇక గాయత్రి ఎప్పుడు ఇలాగే ఉండమని అంటుంది. సారీ అభి అంకుల్ వాళ్లకు నేను డబ్బులు ఇవ్వను అని అంటుంది. వాళ్ల ఇద్దరు తెలివైన వాళ్ళు.. రెస్పాన్సిబిలిటీ నాది అంటాడు అభి.. ఇదే రెస్పాన్సిబిలిటీ ప్రేమ్ మీద ఎందుకు చూపించావు అని అంటుంది.. తులసి మాయలో ఉన్నావు.. చేతికి డబ్బు రాగానే నువ్వు మారిపోయావు. ఐ హేట్ యూ అంకిత అని వాళ్ళ అమ్మ అంటుంది.. మీ డాడ్ టూర్ నుంచి రాగానే పవర్ ఆఫ్ అటార్నీ నేను తీసుకుంటా అని అంటుంది గాయత్రి..
ఇక గాయత్రి వాళ్ళ మాటలు అంకిత కు కోపం తెప్పిస్తాయి.. అభి వాళ్ళతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేయాలని డిసైడ్ అయి అంకిత తులసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. తులసి ఇంట్లోకి అంకిత రావడం ఒప్పుకోదు.. మీరు నన్ను ఇంట్లోకి రానివ్వక పోయినా పర్లేదు. నేను మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళను. బయట ఎక్కడైనా ఉంటాను అని అంటుంది అంకిత.. ఇక తులసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం.