విజయవాడ, జనవరి 25: కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ వైపు వస్తున్న ఇన్నోవా కారు డివైడర్ దాటి ఏలూరు వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదస్థలి లోనే ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
previous post