సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో భేటీ అవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఏపీ రాజకీయాల్లో సంచలన వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. పూర్తి విషయంలోకి వెళితే తన నియోజకవర్గమైన హిందూపురంలో మెడికల్ కాలేజ్ విషయమై జగన్ తో మాట్లాడాలని బాలయ్య డిసైడ్ అయినట్లు టిడిపి పార్టీలో టాక్ వస్తోంది. తన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని బాలకృష్ణ అధికార పార్టీతో ముందు చర్చలు జరిపిన తర్వాత స్పందన సరిగ్గా లేకపోతే పోరాటం చేయాలని అనుకుంటున్నారట.
ఈ నేపథ్యంలో ఇప్పటికే మెడికల్ కాలేజ్ కి సంబంధించి ఏపీ రాష్ట్ర మంత్రి తో బాలకృష్ణ మంతనాలు జరిపినట్లు టాక్. ఇదిలా ఉండగా వైసీపీ ప్రభుత్వం పై ఇటీవల బాలకృష్ణ విమర్శలు చేయడం జరిగింది. గడిచిన ఏడాది కాలంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం ఇటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపణలు చేశారు. పరిపాలన గాలికోదిలేసి కేవలం కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, చాలా మందిని బలి తీసుకుంటున్నట్లు బాలయ్య బాబు పేర్కొన్నారు.
ప్రభుత్వ పెద్దలు కూడా సరైన సలహాలు సూచనలు చేయకుండా సైలెంట్ గా ఉంటున్నట్లు బాలయ్య బాబు తన అభిప్రాయాన్ని తెలిపారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ధి విషయంలో పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోటీ ఉండేదని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉందని బాలయ్య చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే దసరా కంటే ముందే బాలయ్య బాబు వైయస్ జగన్ తో వ్యక్తిగతంగా భేటీ అవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. గతంలో వైయస్ జగన్ బాలకృష్ణ కి అభిమాని అని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో బాలయ్య బాబు తో వైఎస్ జగన్ భేటీ అవ్వటం నందమూరి అభిమానులలో మరియు వైసీపీ పార్టీలో పెను సంచలనంగా మారింది.