వైసీపీ అధినేత జగన్ మైండ్ సెట్ నుండి పుట్టుకొచ్చిన గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ దేశంలోనే సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థ పనితీరు గురించి తెలుసుకున్న ప్రధాని మోడీ కూడా ఇతర రాష్ట్రాలు ఈ విధానాన్ని అవలంబిస్తే బాగుంటుందని సూచించడం జరిగింది. చాలావరకు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గర చేయటంలో .. ప్రజలకు ప్రభుత్వాలపై నమ్మకం కలిగించడంలో ఈ రెండు వ్యవస్థల పనితీరు అభినందనీయమని చాలామంది చెప్పుకొచ్చారు.
ఎక్కడా కూడా ఈ వ్యవస్థలపై ఫిర్యాదులు రాలేదు. ఇదిలా ఉండగా ఎంతో బాధ్యతగా విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులకు షాక్ ఇచ్చేలా ఉన్నతాధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వస్తోంది. మేటర్ లోకి వెళితే గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో ఆ ప్రాంతంలోనే అనగా అదే గ్రామంలో నివాసం ఉండాలి వార్డు సచివాలయాల్లో ని సిబ్బంది అదే మున్సిపాలిటీ పరిధిలో ఉండాలని ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో వస్తున్న ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్న చర్చ ఇప్పుడు గ్రామ సచివాలయ సిబ్బందిలో నెలకొంది. మరోపక్క ఉన్నత అధికారులు ఎప్పటికప్పుడు గ్రామ సచివాలయ పనితీరు ఎలా ఉంటుందో వంటి విషయాలు తెలుసుకోటానికి తనిఖీ చేస్తుండటంతో… సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గానే ఉంటున్నారు. ఎక్కడా కూడా ప్రజల నుండి గ్రామ సచివాలయ వ్యవస్థ పై ఫిర్యాదులు వచ్చిన దాఖలాలు లేవు. ప్రభుత్వం నుండి అమలవుతున్న సంక్షేమ పథకాలు సకాలంలో ప్రజలకు చేరుతున్నాయి. ఇలాంటి తరుణంలో మరింతగా ప్రభుత్వ పనులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. గ్రామ సచివాలయ ఉద్యోగులు అదే గ్రామంలో పనిచేసే రీతిలో వ్యవహరించేలా ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు టాక్ నడుస్తోంది.