ఒక టాలీవుడ్ నటి తో రాసలీలలు సాగిస్తూ వీడియోకు దొరికిపోయిన వివాదాస్పద నిత్యానంద స్వామీజీ అందరికీ గుర్తుండే ఉంటాడు.అదే గాకుండా అనేకానేక ఇతర వివాదాల్లో కూడా అయన చిక్కుకున్నాడు.
అత్యాచారం కిడ్నాప్ వంటి కేసుల్లో కూడా ఇరుక్కుని జైలుపాలు సైతం అయ్యాడు. దాంతో ఆయన ఇండియా నుండి మకాం ఎత్తేశారు.ఇక్కడ బాగా సంపాదించుకున్న సొమ్ముతో విదేశాలకి వెళ్ళిపోయి అక్కడే స్థిరపడ్డాడు.పేరు కూడా నిత్యానంద గా మార్చేసుకున్నాడు. తనను తాను దేవుడిగా పిలుచుకునే నిత్యానంద.. కైలాస అనే హిందూ దేశాన్ని ఏర్పాటు చేశాడని ఆమధ్య వార్తలు వచ్చాయి. విదేశాల్లో ఓ ద్వీపాన్ని కొనుగోలు చేసిన నిత్యానంద.. దానికి సంబంధించి ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ దేశానికి నిత్యానందే ప్రధాని అని కూడా తెలుస్తోంది.
అంతేగాక కైలాస దేశంలో చెలామణి అయ్యే కరెన్సీని కూడా నిత్యానంద సృష్టించినట్టు అప్పట్లో మీడియాలో వచ్చింది తాజాగా నిత్యానంద ‘కైలాస’ గురించి మరికొన్ని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఈ కైలాస ఎక్కడ ఉందనే లొకేషన్ మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆస్ట్రేలియాకు దరిదాపులో ఉండొచ్చునని అనుమానిస్తున్నారు. ప్రత్యేక స్థానం అనేది లేని ఈ దేశాన్ని పర్యటించే వారి కోసం ఇప్పుడు వీసాలను జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రత్యేక ఈ-మెయిల్ ఐడీని క్రియేట్ చేశారు. ఆ మెయిల్ ద్వారా విజిటర్స్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ దేశాన్ని పర్యటించే విజిటర్లు కేవలం మూడ్రోజులే ఇక్కడ ఉండేందుకు అనుమతిస్తారని సమాచారం.
ఈ మేరకు కైలాస.ఓఆర్జీలో కొన్ని వివరాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా నుంచి కైలాసకు విమానాలు నడుపనున్నట్లు తెలుస్తోంది. కాగా తమ కైలాస దేశానికి వచ్చే వారికి ఫుడ్డు బెడ్డు కూడా ఉచితమని బంపర్ ఆఫర్ ఇచ్చారు.మూడు రోజుల పాటు మాత్రమే ఇక్కడ ఉండి అన్ని రకాల ఆనందాలు పొందవచ్చును అన్నట్లుగా నిత్యానంద ప్రకటనలు ఉన్నాయి.కాగా తమ సొంత దేశాల్లో హిందూజంను పాటించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారు నిత్యానందతో కలసి కైలాసను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.అయితే ప్రపంచ చిత్రపటంలో కైలాస ఎక్కడ ఉంది అన్నది తేలాల్సి ఉంది!