Liger Movie: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం `లైగర్`. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, పూరీ జగన్నాథ్ కలిసి నిర్మిస్తున్నారు.
బ్యాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ, ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇటీవలె ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా.. ఆగష్టు 25న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అట్టహాసంగా విడుదల కానుంది. ఐదేండ్ల కిందట అంటే 2017 ఆగస్ట్ 25న విజయ్ నటించిన అర్జున్ రెడ్డి సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
ఇప్పుడు మళ్లీ అదే రోజున లైగర్ సినిమాను కూడా విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే.. లైగర్ సినిమా డిజిటర్ స్ట్రీమింగ్ హక్కులు తాజాగా భారీ రేటుకు అమ్ముడుపోయాయట.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఏరంగా రూ. 60 కోట్లు చెల్లించి మరీ లైగర్ రైట్స్ను సొంతం చేసుకుందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారమే నిజమైతే విజయ్ కెరీర్లో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో కుదరిన డీల్ ఇదే అవుతుంది.