NTR: `ఆర్ఆర్ఆర్` అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివతో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్తో గత ఏడాదే ఈ ప్రాజెక్ట్ను అఫీషియల్గా అనౌన్స్ చేశారు. యుశసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నాయి.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో ఇప్పటి వరకు హీరోయిన్ ఫైనల్ కాలేదు. మొదట ఈ చిత్రంలో దివంగత నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనుందని ప్రచారం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కానీ, ఆ ప్రచారం నిజం కాదని, ఎన్టీఆర్ సినిమా నుంచి తమను ఎవరూ సంప్రదించలేదని జాన్వీ తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ స్పష్టం చేశారు. ఇక ఆ తర్వాత అలియా భట్, రష్మిక మందన్నా, పూజా హెగ్డే, దిశా పటానీ ఇలా పలువురి పేర్లు వినిపించినా.. మళ్లీ అటు తిరిగి, ఇటు తిరిగి జాన్వీ కపూర్ పేరే తెరపైకి వచ్చింది.
ఇటీవల డైరెక్టర్ కొరటాల శివ.. జాన్వీ కపూర్ను సంప్రదించి, ఆమె పాత్రను వివరించారట. అది విన్న ఆమె ఆలోచించి చెబుతానని కొంత టైమ్ తీసుకున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నారు. ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. ఎన్టీఆర్ మాత్రం జాన్వీ పాపను ఓ పట్టాన వదిలేలా లేడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.