Anil Chauhan: గత ఏడాది డిసెంబర్ మాసంలో బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం తెలిసిందే. కుటుంబంతో సహా మొత్తం 13 మంది ఈ ఘటనలో మరణించారు. భారత తొలి సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణించిన నాటి నుండి సిడిఎస్ స్థానం ఖాళీగా ఉంది. మోడీ ప్రభుత్వం ఆధ్వర్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) పదవిని తీసుకుని రావడం జరిగింది. ఆర్మీ ఇంక నేవీ ఎయిర్ ఫోర్సులను సమన్వయం చేసేందుకు తీసుకొచ్చిన ఈ పదవి రావత్ మరణించాక మొన్నటిదాకా ఖాళీగానే ఉంటూ ఉంది. ఈ క్రమంలో తాజాగా సెప్టెంబర్ 28వ తారీకు భారత త్రివిధ దళాల నూతన అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహన్ (రిటైర్డ్) నీ నియమిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
మిలటరీ వ్యవహారాల శాఖలో భారత ప్రభుత్వ కార్యదర్శిగా అనిల్ చౌహాన్ ఇకనుండి పనిచేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. చౌహాన్ గతంలో ఈస్టర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్ గా పదవీ విరమణ చేశారు. దాదాపు 40 ఏళ్ల కెరియర్ లో కమాండ్ ఇంకా స్టాప్ మరియు ఇన్స్ట్రుమెంట్ అనుభవం కలిగి ఉన్నారని, జమ్మూ మరియు కాశ్మీర్ ఇంకా ఈశాన్య భారతదేశంలో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలలో మంచి అనుభవం ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
అనిల్ చౌహాన్ 1961 మే 18న జన్మించారు. భారత సైన్యంలో 1981లో చేరారు. ప్రారంభంలో 11 గురక రైఫీల్స్ రెజిమెంట్ లో పనిచేయడం జరిగింది. ఈ క్రమంలో భారత త్రివిధ దళాల నూతన అధిపతి (సిడిఎస్)గా అనిల్ చౌహాన్ నీ నియమించడం పట్ల ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి.. ఇంకా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన పలువురు అధికారులు అభినందనలు తెలియజేశారు.