YS Jagan: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) ఆధ్వర్యంలో జూన్ 30 నుండి జూలై 2 వరకూ అమెరికాలోని డాలస్ నగరంలో నాటా మహాసభలు అట్టహాసంగా జరిగాయి. ఈ మహాసభల్లో తెలుగు సంప్రదాయాలను, కళలను అట్టహాసంగా ప్రదర్శించారు. నాటా తెలుగు మహాసభలను ఉద్దేశించి ఏపి సీఎం వైఎస్ జగన్ వీడియో సందేశం ఇవ్వగా, నాటా సభల్లో ప్రదర్శించారు. రాష్ట్రానికి ప్రవాసాంధ్రుల సహాయ, సహకారాలను ఎంతో అవసరమని, రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడితే ఆ రకంగా ఉపయోగపడాలని కోరారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మూడు సంవత్సరాల నుండి దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్ర రాష్ట్రమే కనిపిస్తొందని అన్నారు సీఎం జగన్. సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ లోనూ రాష్ట్రం టాప్ 4,5 స్థానాల్లో కనిపిస్తొందన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. వివిధ రంగాల్లో ప్రవాసాంధులకు ఉన్న అనుభవాన్ని రాష్ట్రం, గ్రామాల అభివృద్ధి కోసం వినియోగించాలని కోరుతున్నానన్నారు. రాబోయే రోజుల్లో మీ అనుభవాలతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని వేడుకుంటున్నానని అన్నారు. నాటా తెలుగు మహాసభల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం జగన్.
తాడిపత్రి సీఐ ఆత్మహత్య .. జేసీ వర్సెస్ పెద్దారెడ్డి మాటల యుద్దం
అమెరికాలోని డాలస్, నాటా తెలుగు మహా సభలనుద్దేశించి ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ వీడియో సందేశం ఇచ్చారు. ముఖ్యమంత్రి సందేశాన్ని నాటా సభల్లో ప్రదర్శించారు. https://t.co/mI2TjAYAy4 via @YouTube
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 3, 2023