తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవలే నియమితులైన సంగతి తెలిసిందే. తాజాగా టీటీడీ బోర్డు సభ్యుల జాబితా విడుదల అయ్యింది. 24 మంది సభ్యులతో టీటీడీ పాలకమండలిపై అధికారిక ప్రకటన విడుదల అయ్యింది. సీఎం వైఎస్ ఆదేశాల మేరకు సీఎం సెక్రటరీ ధనుంజయరెడ్డి అధికార ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే కోటాలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామికి అవకాశం లభించింది.
టీటీడీ సభ్యులుగా గోదావరి జిల్లాల నుండి సుబ్బరాజు (ఉంగుటూరు), నాగ సత్యం (ఏలూరు), ప్రకాశం జిల్లా నుండి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కుమారుడు శిద్దా సుధీర్, కడప నుండి యానాదయ్య, మసీమ బాబు, మంత్రాలయంకు చెందిన వై సీతారామిరెడ్డి, అనంతపురం జిల్లా నుండి శరత్, అశ్వద్దానాయక్ లకు అవకాశం దక్కింది. అలానే మేకా శేషుబాబు, రాంరెడ్డి సాముల, బాలసుబ్రమణియన్ పళనిస్వామి, ఎస్ఆర్ విశ్వనాథ్ రెడ్డిలకు చోటు దక్కింది. అలాగే తమిళనాడు నుండి డాక్టర్ శంకర్, కృష్ణమూర్తి, కర్ణాటక నుండి దేశ్ పాండే, తెలంగాణ నుండి ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీతా, మహారాష్ట్ర నుండి అమోల్ కాలే, సౌరఖ్ బోరా, మిలింద్ సర్వకర్ లకు అవకాశం కల్పించారు.
సాలూరులో కేంద్రీయ గిరిజన యూనివర్శిటీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్