Employees DA: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది ఈసీ. డీఏ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి ఇచ్చింది. ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్ లో ఉండగా, ఒక డీఏ విడుదలకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ సర్కార్ ఇటీవల ఈసీకి విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ మధ్య సంప్రదింపులు జరిగాయి. డీఏ చెల్లింపు ఎందుకు ఆలస్యం అయ్యింది, ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారంటూ తెలంగాణ సర్కార్ ను ఈసీ అడిగింది.
గతంలో డీఏ ల చెల్లింపుల విధానాలపైనా ఈసీ ఆరా తీసింది. డీఏ విడుదలకు అనుమతి ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా ఈసీకి తమ వినతిని పంపాయి. పోలింగ్ కు ముందు అనుమతి ఇవ్వని ఈసీ .. తాజాగా పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతి ఇచ్చింది. ఒక డీఏ విడుదలకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది.
రైతు బంధు నిధుల పంపిణీకి ఈసీ తొలుత అనుమతి ఇచ్చింది. అయితే రైతు బంధు నిధుల పంపిణీ పై మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచార సభలో వ్యాఖ్యలు చేయడంతో ఈసీ.. రైతు బంధు పథకం నిధుల పంపిణీకి ఇచ్చిన అనుమతిని వెనక్కు తీసుకుంది. 30వ తేదీన తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగియగా, ఆదివారం (3వ తేదీ) ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక సోమవారం తర్వాతనే రైతు బంధు పథకం నిధుల పంపిణీ చేసే అవకాశం ఉంటుంది.
Nagarjuna Sagar dam row: సాగర్ జల వివాదం ..తెలంగాణ పోలీసులపైనా ఏపీలో కేసు నమోదు