Gyanvapi Case: జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లిం సంఘాలు దాఖలు చేసిన పిటీషన్లను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ముస్లిం సంఘాలు దాఖలు చేసుకున్న అయిదు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. అయితే ఈ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసును ఆరు నెలల్లోనే విచారణ పూర్తి చేయాలని వారణాసి కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జ్ఞానవాపి మసీదులో పూజలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ హిందూసంఘాలు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ ఆధారంగానే ఆ మసీదులో సైంటిఫిక్ సర్వే చేపట్టారు. ఆ నివేదికను కూడా ఇటీవల కోర్టుకు సమర్పించారు. అయితే హింధూ సంఘాల పిటిషన్లను సవాల్ చేస్తూ ముస్లిం సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు ఇవేళ (మంగళవారం) కొట్టివేసింది.
ముస్లిం సంఘాలు మొత్తం అయిదు పిటిషన్లు దాఖలు చేశాయి. సున్ని సెంట్రల్ వక్స్ బోర్డు, అంజుమన్ ఇంతెజామియా మసీద్ కమిటీ ఆ పిటిషన్లు వేశాయి. ఇక ఆలయాన్ని పునరుద్దరించాలని కోరుతూ దాఖలు చేసిన సివిల్ పిటిషన్లకు హైకోర్టు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.