YSRCP Vs TDP – Janasena: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మరో సారి విజయం సాధించి తన పాలనను సుస్ధిరం చేసుకోవాలన్న లక్ష్యంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రకరకాల వ్యూహాలను రచిస్తున్నారు. అధికార వైసీపీని ఎలాగైనా గద్దె దింపి తాము అధికారంలోకి రావాలని టీడీపీ – జనసేన కూటమి ప్రతి వ్యూహాలతో సిద్దం అవుతోంది. ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వరుస భేటీలు జరుపుతూ రాజకీయ వ్యూహాలపై చర్చిస్తున్నారు. మరో మూడు నాలుగు నెలల్లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్ధుల ఎంపికపై దృష్టి పెట్టాయి. దీంతో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో తన కంటూ ఒక ఓటు బ్యాంక్ ను సుస్ధిరం చేసుకున్న వైసీపీ గెలుపు ధీమాతో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందన్న ఆశతో జనసేన – టీడీపీ కూటమి ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే దానిపై సామాన్యుల నుండి రాజకీయ నాయకుల వరకూ అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఓ ప్రముఖ సర్వే సంస్థ ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఏయే జిల్లాల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి..? అధికారం ఎవరిదో అంచనా వేస్తూ రిపోర్టును విడుదల చేయడం జరిగింది.
ఆ సర్వే సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా శాంపిల్స్ తో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రజల అభిప్రాయాలను సేకరించినట్లుగా తెలుస్తొంది. ఆ సర్వే ఆధారంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అంచనా వేసింది. ఆ లెక్కల ప్రకారం ఏపీలో వైసీపీకి 50.10 శాతం, టీడీపీ – జనసేన కూటమికి 43.12 శాతం, ఇక మిగిలిన 4.70 శాతం హోరాహోరీగా ఉండే అవకాశం ఉందని తేల్చింది. ఆ అంచనా బట్టి చూస్తే వైసీపీకి 110కిపైగా స్థానాల్లో, 46కుపైగా స్థానాల్లో టీడీపీ – జనసేన కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్పిందట.
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చూసుకున్నట్లయితే ..శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వైసీపీ 4, టీడీపీ జనసేన కూటమికి 3, విజయనగరంలో వైసీపీకి 4, టీడీపీ – జనసేన కూటమికి 1, అరకులో వైసీపీకి 6, టీడీపీకి 1, విశాఖపట్నంలో వైసీపీకి 4, టీడీపీ జనసేన కూటమికి 2, అనకాపల్లిలో వైసీపీకి 4, టీడీపీ జనసేనకు 2, రాజమండ్రిలో వైసీపీకి 3, టీడీపీ జనసేన కూటమికి 4, కాకినాడలో వైసీపీ కి 4, టీడీపీ, జనసేన కూటమికి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
అమలాపురంలో వైసీపీకి5, టీడీపీ – జనసేన కూటమికి 1, నరసాపురంలో వైసీపీకి 1, టీడీపీ – జనసేనకు 5, ఏలూరులో వైసీపీకి 5, టీడీపీ – జనసేనకు 2, మచిలీపట్నంలో వైసీపీకి 4, టీడీపీ – జనసేనకు 3, విజయవాడలో వైసీపీకి4, టీడీపీ – జనసేనకు 2, గుంటూరులో వైసీపీకి 3, టీడీపీ – జనసేనకు 3, నరసరావుపేట లో వైసీపీకి 6, టీడీపీ – జనసేనకు 1, బాపట్లలో వైసీపీకి 3, టీడీపీ – జనసేనకు 3, ఒంగోలులో వైసీపీకి 4, టీడీపీ – జనసేనకు 3, నెల్లూరులో వైసీపీకి 5, టీడీపీ – జనసేనకు 1, కర్నులులో వైసీపీకి6, టీడీపీ – జనసేనకు 1, నంద్యాలలో వైసీపీకి 6, టీడీపి – జనసేనకు 1, తిరుపతిలో వైసీపీకి 4, టీడీపీ –జనసేనకు 1, చిత్తూరులో వైసీపీకి 4, టీడీపీకి 1, అనంతపూర్ లో వైసీపీకి 4, టీడీపీ –జనసేనకు 2, హిందూపూర్ లో వైసీపీకి 5, టీడీపీ – జనసేనకు 2, రాజంపేటలో వైసీపీకి 7, కడప లో వైసీపీకి ఏడు స్థానాలు వచ్చాయని అంచనా వేసింది. అయితే పలు సర్వే సంస్థలు వివిధ రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఫలితాలను వెల్లడి చేస్తుండటంతో ఏ ఫలితాలు నిజమైనవో తెలియక ప్రజలు తికమకపడుతున్నారు.
Covid Subvariant JN.1: మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు .. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం