Prabhas Maruthi: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. “సలార్” సినిమా విజయంతో ఫుల్ ఆనందంగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది. 2023 ఏడాదిలో అన్ని సినిమాల కంటే “సలార్” రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. సినిమా విడుదల ఈ వారం రోజులు గడవకముందే ₹500 కోట్లు కలెక్ట్ చేసే అందరికి షాక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో కూడా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చాలా సైలెంట్ గా జరుగుతుంది.
ప్రభాస్ కెరియర్ లో ఎన్నడూ టచ్ చేయని జోనర్ హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు టాక్. ప్రభాస్ తో ఈ సినిమాలో… మంచి కామెడీ మారుతి పండించబోతున్నారట. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహన్ అని హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉంది. పాన్ ఇండియా నేపథ్యంలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి క్రేజీ సర్ప్రైజింగ్ అప్ డేట్ ఇవ్వటం జరిగింది.
ఇప్పటివరకు డైనోసార్ ప్రభాస్ ని చూశారు ఇక డార్లింగ్ ప్రభాస్ నీ చూసేందుకు సిద్ధమవ్వండి అంటూ ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పై క్రేజీ అప్డేట్ డిసెంబర్ 29 ఉదయం ఇవ్వటం జరిగింది. సంక్రాంతి పండుగ కానుకగా మారుతి ప్రభాస్ సినిమాకి సంబంధించిన టైటిల్ అదేవిధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయబోతున్నట్లు.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియా విభాగం తెలియజేసింది. ఊహించిన విధంగా సర్ప్రైజ్ ఇవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ ఏడాది ఆదిపురుష్, సలార్ విడుదలయ్యాయి. వచ్చే ఏడాది కూడా రెండు లేదా మూడు సినిమాలు ప్రభాస్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు టాక్.