IT Raids: హైదరాబాద్ లో మరో సారి ఆదాయపన్ను శాఖ(ఐటీ) సోదాలు కలకలం రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలు కంపెనీలు, వ్యక్తులపై సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు గత కొద్ది కాలంగా సైలెంట్ గా ఉన్నారు. తాజాగా మరో సారి ఐటీ దాడులు ప్రారంభించారు.
ఇవేళ ఉదయం నుండి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం, మొయినాబాద్ కోకాపేటలో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తొంది. ఓ ఫార్మా కంపెనీతో పాటు మరో తొమ్మిది ప్రదేశాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మోయూనాబాద్ లోని స్కిల్ ప్రమోటర్స్ ఇళ్లలోనూ ఐటీ సోదాలు చేస్తొంది.
అలాగే శ్రీహరిహోమ్స్ రవీంద్ర అగర్వాల్, చందర్ రాజరెడ్డి, ప్రకాశ్ రెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వాస్తవానికి ఆదాయానికి అనుగుణంగా పన్నులు చెల్లించని సంస్థలు, వ్యక్తులపైనే ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నా అవి ఎన్నికల ముందు జరుగుతుండటంతో ఆ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరో సారి ఐటీ అధికారులు దాడులు చేపట్టడం కలకలాన్ని రేపుతోంది.
ఇంతకు ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఐటీ, ఈడీ తనిఖీలపై మాట్లాడుతూ .. ఎన్నికలకు ముందు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ, ఈడీ వాళ్లు వస్తారని ఆ తర్వాత మోడీ వస్తారని కామెంట్స్ చేశారు. కవిత కామెంట్స్ చేసినట్లుగానే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ఐటీ సోదాలు జరిగాయి.
YSRCP: పార్ధసారధి పరేషాన్ ..! ఎందుకంటే ..?