Rajamouli Mahesh Babu: భారతీయ చలనచిత్ర రంగంలో ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా తెరకెక్కే సినిమాలలో ఒకటి “SSMB 29”. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కకబోయే ఈ సినిమా కోసం యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా షూటింగ్ అధికారిక ప్రకటన జరగనుంది. ప్రస్తుతం మహేష్ బాబు “గుంటూరు కారం” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. జనవరి 12వ తారీకు ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. నేడు గుంటూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి రాజమౌళి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. “గుంటూరు కారం” తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ మహేష్ బాబు మొదలు పెట్టనున్నారు.
దాదాపు ₹1000 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ తరహాలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందించనున్నారు అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లేటెస్ట్ గా మహేష్ రాజమౌళి ప్రాజెక్టు గురించి ఎంఎం కీరవాణి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నపై స్పందించడం జరిగింది. దాని గురించి రాజమౌళిని అడగాలి. ఆయనకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అంటే వర్క్ నా వరకు ఇంకా రాలేదు..అని అన్నారు. మొన్ననే ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ సీనియర్ రచయిత విజయేంద్రప్రసాద్ కంప్లీట్ చేయడం జరిగిందంట.
అయితే త్వరలోనే మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్ గా కీరవాణి ఇంకా తన పని స్టార్ట్ కాలేదు అని చెప్పటంతో.. స్క్రిప్ట్ వరకు పని ఇంకా జరుగుతున్నట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ మార్చి నెలలో “SSMB 29” సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇందుకోసం “RRR” తరహాలో… ఆ సినిమా స్టార్టింగ్ లో ఒక పెద్ద మీడియా సమావేశం నిర్వహించినట్లు “SSMB 29″కి కూడా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.