Pawan Kalyan: పవన్ కళ్యాణ్-క్రిష్ జాగర్లమూడి కాంబోలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ ను మే 2న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ధర్మం కోసం యుద్ధం అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. 17వ శతాబ్దం నాటి చారిత్రక కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ వీరోచిత బందిపోటుగా కనిపించనున్నట్లు సమాచారం. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు. మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో ఈ సినిమా ఉంటుందని సమాచారం.
ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలలో పూర్వకాలపు యుద్ధ నైపుణ్యాలతో పవన్ కళ్యాణ్ అదరగొట్టే పర్ఫామెన్స్ ఇవ్వడం జరిగిందంట. ఈ సినిమాని నిర్మాత ఏఏం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించటం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ తో “ఖుషి” సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకోవటం జరిగింది. దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఏఏం రత్నం సినిమా చేస్తున్నారు. దీంతో “హరిహర వీరమల్లు” సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. సినిమా షూటింగ్ దాదాపు 80 శాతానికి పైగా కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు.
దీంతో జూన్ నెల వరకు సినిమా షూటింగ్స్ మొదలుపెట్టే ప్రసక్తి లేదు. గత ఏడాది డిసెంబర్ నుండే షూటింగ్స్ ఆపేయడం జరిగింది. ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చాక అనంతరం పవన్ మళ్లీ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. పవన్ గెలుపు కోసం చాలామంది ఇండస్ట్రీకి చెందిన నటీనటులు పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. 2019 ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ భావిస్తున్నారు.