సాధారణంగా బీట్రూట్ ని ప్రతి ఒక్కరు ఎక్కువగా తింటూ ఉంటారు. దీనివల్ల అనేక రోగాల ను నివారించవచ్చని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. బీట్రూట్లో నైట్రేట్ ఉంటుంది. నిపుణుల ప్రకారం, శరీరంలో నైట్రేట్ పరిమాణం పెరిగితే అది కడుపులో తిమ్మిరిని కలిగిస్తుందని చెబుతున్నారు. దీని రసం కొంతమందికి కడుపు నొప్పిని కూడా కలిగిస్తుంది.
అదేవిధంగా జీర్ణ సమస్యలు కూడా ఏర్పడతాయి. నైట్రేట్ కారణంగా గర్భిణీ స్త్రీలు కూడా బీట్రూట్ ను చాలా తక్కువ పరిమితిలో తీసుకోవడం మంచిది. ఇక ఇందులో కాపర్, ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. అందువల్ల పెద్ద పరిమాణంలో ఈ ఖనిజాలు కాలేయంలో చేరడం ప్రారంభించి దానిని దెబ్బతీస్తాయి. బీట్రూట్లో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల కిడ్నీలో రాళ్లు చేరడం వంటి సమస్యలు ఏర్పడతాయి.
తక్కువ రక్తపోటు ఉన్నవారు బీట్రూట్ ను ఎక్కువగా తినకూడదు. అలా తినడం ద్వారా వారి రక్తపోటు మరింత తగ్గుతుంది. బీట్ రూట్ లో లభించే అధిక స్థాయి నైట్రేట్ రక్త కణాలను దెబ్బతీస్తాయి. బీట్ రూట్ తీసుకోవడం ద్వారా మీకు ఎలర్జీ సమస్యలు వంటి అనారోగ్య సమస్యలు కూడా దరి చేరుతాయి. బీట్రూట్ లో ఉండే అధిక చక్కర స్థాయిలు కారణంగా షుగర్ ఉన్నవారు దీనిని అస్సలు తీసుకోకూడదు. ఇందువల్ల బీట్రూట్ ని మితంగా తీసుకోవడం చాలా మంచిది. లేదంటే ఎక్కువగా తీసుకోవడం ద్వారా అమృతం కూడా విషం గా మారుతుంది.