Nagarjuna: తెలుగు చలనచిత్ర రంగంలో అక్కినేని నాగార్జున గత నాలుగు దశాబ్దాలుగా విజయవంతంగా రాణిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినిమా రంగం ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఇప్పటికీ 90కి పైగా సినిమాలు చేయడం జరిగింది. ఈ సంక్రాంతి పండుగకు “నా సామి రంగ” అనే సినిమాతో మంచి విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే త్వరలో నాగార్జున తన కెరియర్ లో మైల్ స్టోన్ వందో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయటానికి రెడీ అవుతున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు విషయంలో నాగార్జున చాలా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. స్క్రిప్ట్ కొత్తగా ఉండేలా చూసుకుంటూ భారీ ప్రయోగానికి నాగార్జున రెడీ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
దీంతో ఈ సినిమా ప్రాజెక్టు కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తన కెరియర్ లో ఇది ఒక బెంచ్ మార్క్ సినిమాలో నిలిచిపోవాలని నాగార్జున.. తమిళ దర్శకుడితో ప్రయోగాత్మకమైన స్క్రిప్ట్ కి ఓకే చెప్పినట్లు టాక్. దీనికి ముందు తమిళ్ దర్శకుడు మోహన్ రాజా పేరు వినబడింది. కానీ ఆయన చెప్పిన స్టోరీలో కొత్తదనం లేకపోవడంతో నాగార్జున ఆ ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టినట్లు టాక్. ఈ విషయం నడుస్తూ ఉండగానే ఇటీవలే మరో తమిళ్ దర్శకుడు నవీన్ స్టోరీ వినిపించినట్లు చాలా కొత్తగా ఉండటంతో నాగార్జున కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ తో పాటు నాగార్జున కలిసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయిన వెంటనే తన వందో సినిమా పనులు ఆరంభించడానికి నాగార్జున రెడీ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య… అఖిల్ కూడా నటించే అవకాశాలున్నట్లు మరోపక్క ప్రచారం జరుగుతుంది. కాగా స్పెషల్ అపీరియన్స్ పరంగా వారిద్దరికీ కూడా నాగార్జున స్పెషల్ పాత్రలు ఉండేలా చూసుకుంటున్నట్లు టాక్.
Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!