Prabhas PV Sindhu: భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు అందరికీ సుపరిచితురాలే. దేశం తరఫున బ్యాడ్మింటన్ లో పలు ప్రతిష్టాత్మకమైన ట్రోఫీలు గెలవడం జరిగింది. పీవీ సింధు తెలుగు రాష్ట్రానికి చెందిన యువతి కావడంతో ఆమెకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుండి భారీగా సపోర్టు ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం ఆమెకు అకాడమీ పెట్టుకోవడానికి అవకాశం కూడా కల్పించారు. కాగా రీసెంట్ గా ఓ వెబ్ మీడియా ఛానల్ కి పీవీ సింధు ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఇంటర్వ్యూలో తెలుగులో తన అభిమాన నటుడు ప్రభాస్ అని తెలియజేయడం జరిగింది. ప్రభాస్ బాగా నటిస్తారని ఆయన సినిమాలు చూస్తుంటానని తెలిపారు.
అంతేకాదు రామ్ చరణ్.. ఎన్టీఆర్ నటన కూడా ఇష్టమని చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ సినిమాలలో కొన్ని నచ్చాయి. కానీ కొన్ని సినిమాలు నచ్చలేదు. ఏ ఏ చిత్రాలు నచ్చలేదు అని అడిగి చెబితే కాంట్రవర్సీ అవుతుందంటూ చిన్న స్మైల్ ఇచ్చారు. నాకు నచ్చని సినిమాలు వేరే వాళ్ళకి నచ్చొచ్చు. ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఏ హీరో అయినా సక్సెస్ అవుతుందని నమ్మకంతోనే సినిమా చేస్తారు. వాళ్లపై కూడా ఒత్తిడి ఉంటుంది. సినిమా హిట్ అవుతుందా.. ఫ్లాప్ అవుతుందో తెలియదు. కానీ నెలల తరబడి షూటింగ్ చేస్తారు. వాళ్ల కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు అని సింధు తెలియజేశారు. క్రీడాకారులకి ఒత్తిడి ఉన్నట్టే సినిమా వాళ్లకి కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
తను వరుసగా రెండుసార్లు ఒలంపిక్స్ లో పథకాలు సాధించిన సందర్భంగా చిరంజీవి 2021లో ఇంటికి ఆహ్వానించి సత్కరించడానికి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే గతంలో సింధు సినిమాల్లోకి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలలో వాస్తవం లేదని ఇంటర్వ్యూలో కొట్టి పారేసింది. తన ఆలోచన మొత్తం ఆటపైన తప్ప నటించాలని ఇంట్రెస్ట్ తనకు లేదని తేల్చి చెప్పింది. అయితే భవిష్యత్తులో సినిమాల విషయంలో తన నిర్ణయం ఏరకంగా ఉంటుందో ఇప్పుడే చెప్పలేనని పేర్కొంది. ఇదే సమయంలో ఒకవేళ తన బయోపిక్ తీస్తే తన పాత్రలో దీపిక పదుకొనే లాంటి హీరోయిన్ నటిస్తే బాగుంటుందని పీవీ సింధు వ్యాఖ్యానించింది.