వివాదస్పద కామెంట్స్తో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి పాయల్ రోహ్తగీ సతీసహగమనంపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆమె తన ట్విట్టర్ అకౌంట్లో బ్రహ్మ సమాజ స్థాపకుడు, సతీసహగమనం నిషేధానికి కృషి చేసిన రాజారామ్మోహన్రాయ్ గురించి ప్రస్తావించారు. “అందరూ రాజారామ్మోహన్రాయ్ను అధునిక సమాజ నిర్మాణకర్తగా అభివర్ణిస్తుంటారు. అయితే సతీ సహగమనానికి చెడ్డ పేరు తేవడానికే ఆంగ్లేయులు ఆయన్ని చెమ్చాగా వాడుకున్నారు. సతీసహగమనమనేది అనివార్యం కాదు. మొఘల్ నియంతల కారణంగా మహిళలు వేశ్యా వృత్తిలోకి దిగాల్సి వస్తుందని, హిందూ మహిళలను కాపాడుకునేందుకు ఈ ఆచారం వచ్చింది. అది అప్పటి మహిళల ఇష్టప్రకారమే జరిగేది. ఇదేమీ దురాచారం కాదు“ అంటూ ఆమె రాజారామ్మోహన్ రాయ్పై ఆరోపణలు చేశారు.
previous post
next post