ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. హోదా సాధించడంలో సీఎం వైఎస్ జగన్ విఫలమయ్యారని ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి సాధన సమితి నేతలు యత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో జై భారత్ నేషనల్ పార్టీ అధినేత వీవీ (జేడీ) లక్ష్మీనారాయణ సహా నేతలు రోడ్డుపై భైటాయించారు.
దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలానే సీఎం క్యాంప్ కార్యాలయం వైపు దుసుకువెళుతున్న యువజన విద్యార్ధి జేఏసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక హోదా సమితి నేత చలసాని శ్రీనివాస్, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ (వీవీ) లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు తదితరులను అరెస్టు చేసి మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో సీఎం జగన్ ఘోరంగా విఫలయ్యారన్నారు. విభజన జరిగి పదేళ్లైనా హోదా సహా విభజన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణలో సీఎం ఘోరంగా విఫలమయ్యారన్నారు. వెంటనే ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని సీఎం జగన్ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదా ఇచ్చేలా కృషి చేయాలని లేదంటే ప్రజలు క్షమించరని అన్నారు. అందరూ కలిసి రాష్ట్రాన్ని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దం అంటొన్న సీఎం జగన్ .. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లేందుకు సిద్దమవ్వాలని అన్నారు. హోదా సాధన కోసం టీడీపీ, కమ్యూనిస్టులు ఇతర పార్టీలంతా కలిసి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
Breaking: బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో భారీ పేలుడు .. నలుగురికి గాయాలు.. పాఠశాలలకు బాంబ్ బెదిరింపులు..