వైసీపీని అధికారం నుంచి దించేయాలన్న వ్యూహం బాగానే ఉంది. అయితే.. ఇక్కడే ప్రతిపక్షాలను ఆలో చనలో పడేసేలా అధికార పార్టీ వ్యూహం రెడీ అవుతోందని తెలిసింది. రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు ఎన్నికల సమయంలో ఎవరిని ఎలాంటి గెలుపు తీరాలకు చేర్చుతాయో చెప్పలేం. ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి వ్యూహ ప్రతివ్యూహాలే తెరమీదికి వచ్చాయి. అధికార పార్టీ వైసీపీని గద్దె దింపేందుకు.. ప్రతిపక్షా లు దాదాపు జట్టు కట్టాయి.
టీడీపీ-జనసేన, కాంగ్రెస్-కమ్యూనిస్టులు ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్పై ఉమ్మడి పోరుకు రెడీ అయ్యా యి. వీటికి బీజేపీ కూడా తోడు అవుతుందనే సమాచారం వస్తోంది. మొత్తంగా ఉన్న పార్టీలన్నీ కూడా మూ కుమ్మడిగా జగన్పై యుద్ధానికి రెడీ అయ్యాయి. వీటి లక్ష్యం వైసీపీని అధికారంలో నుంచి బయటకు పంపించేయడమే. ఈ క్రమంలోనే ప్రచారాలు, మాటల తూటాలు పేలుతున్నాయి. వీటికి తోడు.. బీసీలపై దాడులు, ఎస్సీ, ఎస్టీలపై కేసులను తెరమీదికి తీసుసుకు రానున్నారు.
ఇక, వివేకానందరెడ్డి దారుణ హత్య, కోడికత్తి కేసు, డాక్టర్ సుధాకర్పై జరిగిన దాష్టీకం.. ఇలా ప్రతిపక్షాల అమ్ముల పొదిలో పలు అంశాలు పాతవే అయినా.. కొత్తగా తెరమీదికి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇవన్నీ కలగలిపి.. జగన్పై యుద్ధం చేయాలనేది… ఆయనను అధికారం నుంచిదించేయాలనేది ప్రతిపక్షాల ఉమ్మడి వ్యూహంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఇక్కడే వైసీపీ సెంటిమెంటు అస్త్రానికి పదును పెడుతోంది.
`మీ బిడ్డ ఒకవైపు.. ప్రతిపక్షాలన్నీ ఒకవైపు. రేపు మీ బిడ్డ అధికారంలోకిరాకపోతే.. మీకు పింఛన్లు రావు, మీకు సంక్షేమం రాదు. అంతిమంగా వలంటీర్ వ్యవస్థ రద్దవుతుంది. మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. లంచాలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. దీనిని బట్టి మీరే నిర్ణయించుకోండి` అనే కీలకమైన సెంటిమెంటు అస్త్రాన్ని వైసీపీ ప్రయోగించేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇది సహజంగానే ప్రజల సానుభూతిని కొల్లగొట్టే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో మూకుమ్మడి యుద్ధం ప్రమాదాన్నే సూచిస్తోందని అంటున్నారు పరిశీలకులు. 2009లోనూ వైఎస్ ఇలాంటి వ్యూహాన్నే అమలు చేసి.. మహాకూటమిని తట్టుకుని మరీ నిలిచారు. ఇప్పుడు జగన్ కూడా పై న చెప్పుకున్న సెంటిమెంట్ అస్త్రాలను ప్రయోగిస్తే వైసీపీ మరోసారి పవన్ – చంద్రబాబు కూటమిని చిత్తు చేసి అధికారంలోకి వస్తుందనే అంటున్నారు.