Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు “గుంటూరు కారం” సినిమా సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయ్యి పరాజయం పాలైన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా…అభిమానులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. నటనపరంగా మహేష్ కెరియర్ లో అతడు, ఖలేజా సినిమాలు ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. ఈ రెండు సినిమాలలో మహేష్ నటన కొత్త పంతానికి దారి చేసింది. “అతడు” లో ఫేస్ ఎక్స్ప్రెషన్ తో సైలెంట్ నటన, “ఖలేజా”లో కామెడీ నటన… మహేష్ లో కొత్త కోణాన్ని చూపించడం జరిగింది.
దీంతో “గుంటూరు కారం” కూడా అదే రీతిలో ఉంటుందని భావించారు. కానీ సినిమాలో స్టోరీ లేకపోవడంతో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ మార్క్ డైలాగులు సన్నివేశాలు సినిమాలో లేవు. సినిమా మొదటి రోజు విడుదలైన తర్వాత ఇదే విషయాన్ని చాలామంది అభిమానులు తెలియజేసి అసహనం వ్యక్తం చేశారు. “గుంటూరు కారం” సినిమాకి మొదటి నుండి కష్టాలు. సినిమా స్టార్టింగ్ లో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డేనీ తీసుకోవడం జరిగింది. కానీ ఆమె ప్రాజెక్టు మధ్యలోనే వెళ్లిపోయింది. సినిమా షూటింగ్ చాలాసార్లు వాయిదా పడటంతో పూజా హెగ్డేతో పాటు చాలామంది టెక్నీషియన్స్ మధ్యలోని చేతులెత్తేశారు.
ఈ సినిమా చేస్తున్న సమయంలోనే మహేష్ కుటుంబ సభ్యులు మరణించారు. ఇదిలా ఉంటే సినిమా విడుదలయ్యి.. ఇప్పుడు ఓటీడీలో స్ట్రీమింగ్ అవుతున్న క్రమంలో “గుంటూరు కారం”లో పూజ హెగ్డే నటించిన సన్నివేశాల ఫోటోలు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో పూజ హెగ్డేతో పాటు సెకండ్ హీరోయిన్ అనుకున్న శ్రీలీల కనిపిస్తోంది. దీంతో ఈ ఫోటోలు కింద అట్టర్ ప్లాప్ నుండి పూజా హెగ్డే తప్పించుకుందని కామెంట్లు చేస్తున్నారు. హఠాత్తుగా పూజా హెగ్డే ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో ఆమె స్థానంలో శ్రీలీల ఛాన్స్ అందుకోవటం జరిగింది. మహేష్ కి జోడిగా శ్రీలీల నటన సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇదే సమయంలో మహేష్ డాన్స్ కూడా బాగా ఆకట్టుకోవడం జరిగింది.