Krishna Mukunda Murari March 14 2024 Episode 418: ఆదర్శ్ ఫుల్ గా తాగి ముకుందా ఉన్న మురారి ముకుందా ఫోటోలు కనిపిస్తాయి. ఇక వెంటనే ఆ ఫోటోలు చూసి ఆదర్శ్ కోపంగా మురారి తనకు చేసిన అన్యాయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ ఫోటోలను నేల మీద పడేసి తన తాగుతున్న మందును ఆ ఫోటోలు మీద పోసి నిప్పంటిస్తాడు. అప్పటికి ఆదర్శ్ గదిలోకి వెళ్లిన రేవతి మధు ఇద్దరూ ఆదర్శ ఏవో ఫోటోలను కాల్ చేస్తున్నట్టుగా నిప్పు మాత్రం వాళ్లకు కనిపిస్తుంది. మధు వెంటనే ఆ మంటని ఆర్పు అని రేవతి చెబుతుంది. రేయ్ మధు వద్దురా ఆ నిప్పు నువ్వు ఆర్పద్దు నీకు అక్కడ మంట మాత్రమే కనిపిస్తుంది నాకు మాత్రం వాళ్ళిద్దరూ సంతోషం ఆ ఫోటోలలో కనిపిస్తుంది అని ఆదర్శ మధు తో అంటాడు. ఆదర్శ మాటలు వింటున్నా రేవతి మాత్రం మనసులో లోపల బాధపడుతుంది. ఆదర్శ్ కి ఎంత కష్టం వచ్చిందో అని ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఆ ఫోటోలు కాలిపోతుంది నాకు సంతోషం ఆ ఫోటోలలో కాలిపోతున్న మురారి సంతోషం నాకు కనిపిస్తుంది నా బాధ నాకు తెలుస్తుంది అని మధు తో ఆదర్శ్ అంటాడు. ఆదర్శ ఎప్పటికీ కూడా మురారి తనకి అన్యాయం చేశాడని అనుకుంటాడు.
బయటకు వెళ్లిన మురారి కృష్ణ ఇద్దరు ఇంటికి వస్తారు. అప్పటికే ముకుందా గురించి మధుకి ఓ వార్త తెలుస్తుంది. ముకుంద ఏమైంది నాన్న దొరికిందా ఎక్కడ ఉంది అని రేవతి అడుగుతుంది. లేదు అమ్మ ఇంకా ఇంటికి రాలేదా అని మురారి అడుగుతాడు. ఇంటికి వచ్చిందేమో అని మేము అనుకుంటున్నాము అని మురారి అనగానే.. మీరే కదా ముకుందని వెతకడానికి వెళ్లారు మీకు కనిపించిందేమో మీరు తీసుకొస్తారని మేము ఎదురు చూస్తున్నాము అని రేవతి అంటుంది. అప్పుడే మధు వచ్చి టీవీ ఆన్ చేస్తాడు. ఇప్పుడు ఎందుకురా టీవీ అని అంటే ఒక్కసారి ఆ న్యూస్ వినండి అని టీవీలో స్క్రోల్ అవుతున్న న్యూస్ చూపిస్తాడు మధు. టీవీలో 30 ఏళ్ల అమ్మాయి రైలు కిందపడి చనిపోయినట్టు వార్త వస్తుంది. అది చూసి కంగారుగా రేవతి మన ముకుందే అమ్మాయి అని చెప్పి కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆదర్శప్పడికే బాగా తాగి ఉండడం వల్ల కృష్ణ దగ్గరికి వచ్చి నా భార్య చావడానికి నువ్వే కారణం . తనను చనిపోవడానికి కారణం నువ్వే అని ఒప్పుకుంటావా లేదా అని అంటాడు. ముందు ఒకరిని ఒకరు దూషించుకోవడం కాదు ముందు హాస్పిటల్ కి వెళ్దాం పదండి. అక్కడ ఏమైందో తెలియదు కదా ఆ డెడ్ బాడీ ముకుందతో కాదో తెలుసుకోవాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కలిసి హాస్పిటల్ కి వెళ్తారు.
భవాని కుటుంబం అంతా కలిసి టీవీలో వచ్చిన న్యూస్ విని ఒక హాస్పిటల్ కి వెళ్తారు ముకుందా డెడ్ బాడీని చూద్దామని వెళ్లబోతున్న వాళ్లకి ఎదురుగా వాళ్ళ నాన్న శ్రీనివాస్ కనిపిస్తాడు ఆహా ఇప్పుడు వచ్చారా నా నా కూతురు వేసి మీరందరూ తనని చూడటానికి వచ్చారా మీరందరూ ఎంత అన్యాయం చేశారు తనని మీరు ఆఖరి చూపు చూడడానికి కూడా నాకు ఇష్టం లేదు అని అందరి మీద శ్రీనివాస్ అరుస్తూ ఉంటాడు. అన్నయ్య గారు మీరు కోరుతూ చనిపోయిన బాధలో ఉన్నారు కానీ బాగా ఇంటికోడల్ని మేము చివరి చోటు చేసుకున్న అవకాశం మాకు ఇవ్వండి అని రేవతి అడుగుతుంది.
వద్దమ్మా ఇప్పటివరకు మీరు చేసింది చాలు అసలు మురారి ఏ కనక ఈ తప్పు చేయకోకుండా ఉండి ఉంటుంటే నాకు ఇద్దరు సంతోషంగా ఉండేది . ఆదర్శ పెళ్లి చేసుకున్నాడు కానీ నా కూతురుతో ఉండనేలేదు ఇప్పుడు తిరిగి వచ్చాడు. తన మనసులో బాధ మాత్రం అలాగే ఉండిపోయింది నా కూతురు చనిపోవడానికి కారణం మీరే దయచేసి చివరి క్షణంలోనైనా తనని ప్రశాంతంగా పోనివ్వండి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి తనని ఆఖరి చూపు కూడా చూడడం నాకు ఇష్టం లేదు వెళ్ళిపోండి అని శ్రీనివాస్ భవాని వాళ్ళ కుటుంబం మొత్తాన్ని బయటకు పంపించేస్తాడు బాధపడుతూ.
శ్రీనివాస్ ముకుంద కు సంబంధించిన ఆఖరి పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వస్తాడు ఇక చీకటిలో ఉన్న ఆ ఇంట్లో లైట్ వేసేసరికి ముకుందా ఎదురుగా కూర్చున్నట్టుగా శ్రీనివాసన్కి కనిపిస్తుంది. అప్పుడు అమ్మ ముకుందా అని శ్రీనివాస్ పిలిచేసరికి ముకుందా లేచి నిలబడి ముందుకు నడుచుకుంటూ వస్తుంది. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది అంటే ముకుందా బ్రతికే ఉందని అర్థం. ముకుందే కనుక చనిపోతే ఇక ఈ సీరియల్ కి అర్థం ఉండదు. ముకుంద ఏదో ఒక విధంగా మురారిని సాధించుకోవాలని అనుకుంటుందే తప్ప చనిపోవాలని అస్సలు అనుకోదు.
ఇక రేపటి ఎపిసోడ్ లో ఆదర్శ్ కృష్ణ ని దోషగా చేసి ఇంట్లో అందరూ ముందు నిలబడతాడు నీవల్లే నా భార్య చనిపోయింది నువ్వు సంతోషంగా ఉండడం కోసం నాకు ముకుందకి ఇద్దరికీ సంతోషం లేకుండా చేశావు నీ భర్త ప్రేమ నీకు పొందాలని నన్ను నా భార్యను విడదీయడమే కాకుండా ఈరోజు ముకుందా ఈ లోకంలో లేకుండా చేసావని ఆదర్శ్ కృష్ణ ను ఎద్దేవా చేస్తాడు..