Allu Arjun: “పుష్ప” తర్వాత ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదిస్తున్నాడు. సోషల్ మీడియాలో కూడా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఎవరికి అందని రేంజ్ లో దూసుకుపోతున్నాడు. “పుష్ప” సినిమాకి గాను టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు అందుకొని ఉత్తమ జాతీయా నటుడు అవార్డు కూడా గెలవడం జరిగింది. ఈ రకంగా మంచి జోరు మీద ఉన్న అల్లు అర్జున్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకోవడం జరిగింది. విషయంలోకి వెళ్తే దుబాయిలో మేడం టుషాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావడానికి కుటుంబంతో సహా దుబాయ్ వెళ్ళడం జరిగింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మేడం టుషాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ విగ్రహం ఏర్పాటు చేయటం తెలుగు చలనచిత్ర రంగానికి ఎంతో గర్వకారణం అని చెప్పవచ్చు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం మార్చి 28వ తేదీన జరగనుంది. ఇప్పటికే మేడం టుషాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మరియు మహేష్ బాబు మైనప్పు విగ్రహాలు ఏర్పాటు అయ్యాయి. కానీ ఇవి లండన్ లోని మ్యూజియంలో ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ విగ్రహం మాత్రం దుబాయ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఈ మ్యూజియంలో ఇప్పటివరకు సౌత్ ఇండియాకి చెందిన నటుల విగ్రహాలకు చోటుదక్కలేదు. మొట్టమొదటిసారి అల్లు అర్జున్ విగ్రహం అక్కడ ఏర్పాటు చేయడం విశేషం.
అంతేకాకుండా దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న తొలి తెలుగు హీరోగా కూడా బన్నీనే కావటం విశేషం. మేడం టుషాడ్స్ మ్యూజియంలో సినిమా అదే విధంగా వివిధ రంగాలు క్రీడలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలు పొందుపరిస్తారు. సింగపూర్, లండన్, దుబాయ్ ఇలా వివిధ చోట్ల ఈ మ్యూజియానికి సంబంధించిన శాఖలు ఉన్నాయి. దుబాయిలోని మ్యూజియంలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్, షారుక్, ఐశ్వర్యారాయ్, రణబీర్ కపూర్ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో తొలి సౌత్ నటుడు తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన అల్లు అర్జున్ చేరటం టాలీవుడ్ కి ఎంతో గర్వకారణం. ప్రస్తుతం బన్నీ “పుష్ప” సెకండ్ పార్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తారీకు రిలీజ్ చేయబోతున్నారు. “పుష్ప” రెండో భాగం అనంతరం తమిళ దర్శకుడుతో అల్లు అర్జున్ సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.