Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుటుంబం మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసనతో పాటు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఫినిక్ అతిథి గృహానికి చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి బుధవారం వేకువజామున సుప్రభాత సేవలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రామ్ చరణ్ కుటుంబ సభ్యులు దర్శించుకుంటారు. బుధవారం రామ్ చరణ్ పుట్టినరోజు నేపథ్యంలో ఆయన మంగళవారం తిరుమలకు చేరుకోవటంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో ఆయనను చూసేందుకు తిరుమలకు పెద్ద ఎత్తున అభిమానులు అతిథి గృహానికి విచ్చేయడం జరిగింది.
కూతురు పుట్టిన తర్వాత వచ్చిన జన్మదినోత్సవం నేపథ్యంలో భగవంతుని దర్శించుకోవడానికి రామ్ చరణ్ వచ్చినట్టు తెలుస్తుంది. చిరంజీవి వారసుడిగా సినిమా రంగంలో అడుగుపెట్టిన రామ్ చరణ్ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తండ్రికి తగ్గట్టు నటనపరంగా డాన్స్ పరంగా అన్ని రకాలుగా మెగా అభిమానులను అలరించారు. ముఖ్యంగా “రంగస్థలం” సినిమాతో అదిరిపోయే నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. రెండో సినిమా “మగధీర” తోనే ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేశారు. చిరంజీవి లాంటి గొప్ప హీరో కొడుకు అయినా గాని.. క్రమశిక్షణ పరంగా మాట తీర విషయంలో పెద్దలను గౌరవించడంలో చరణ్ చాలా గౌరవప్రదంగా వ్యవహరిస్తారు. 2022వ సంవత్సరం రాజమౌళి దర్శకత్వంలో నటించిన “RRR”తో ప్రపంచవ్యాప్తంగా చరణ్ మంచి పాపులారిటీ సంపాదించారు.
ఈ సినిమాతో తండ్రిని మించిన తనయుడు అన్న విధంగా చరణ్ పేరు దేశంలో కాదు విదేశాలలో కూడా విస్తరించింది. దీంతో ఇప్పుడు చరణ్ నటిస్తున్న సినిమాలపై దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజర్”.. సినిమా చేస్తున్నారు. ఇది చరణ్ కెరియర్ లో 15వ సినిమా. నిర్మాత దిల్ రాజు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమా రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాతో పాటు మరోపక్క బుచ్చిబాబు, సుకుమార్ ప్రాజెక్టులను ఓకే చేయడం జరిగింది. ఆల్రెడీ బుచ్చిబాబు ప్రాజెక్టుకు సంబంధించి పూజా కార్యక్రమాలు అధికారికంగా చేయడం జరిగింది. ఈ సినిమాలో చరణ్ సరసన జాహ్నవి కపూర్ హీరోయిన్ గా చేస్తుంది. సో ఈ ఏడాది వరుస పెట్టి సినిమా షూటింగ్లలో చరణ్ బిజీగా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!