ఒకవైపు.. ఎన్నికల వేడి భయంకరంగా ఉంది. మరోవైపు .. పార్టీల మధ్య పోటీ కూడా తీవ్రంగా ఉంది. ప్రధా న పార్టీలైన వైసీపీ, టీడీపీల మధ్య కత్తులు ఒక్కటే తక్కువ అన్నట్టుగా పొలిటికల్యుద్ధం ఓ రేంజ్లో సాగుతోంది. మరి ఇంత జరుగుతుంటే.. వైసీపీ కీలక నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి ఎక్క డైనా కనిపిస్తున్నారా? ఆయన మాట ఎక్కడైనా వినిపిస్తోందా? కనీసం.. ఆయన గురించిన ఊసైనా వినిపి స్తోందా? అంటే లేదనే చెప్పాలి. మరి ఆయన ఏం చేస్తున్నారు? ఇదీ.. అసలు ప్రశ్న.
అయితే..ఇక్కడే పెద్దిరెడ్డి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సైలెంట్గా రాజకీయాలు చేస్తు న్నారు. ఆయనకు సీఎం జగన్ అప్పగించిన టాస్క్లో నిర్విఘ్నంగా దూసుకుపోతున్నారు. ప్రధానంగా కుప్పం, పిఠాపురం, మంగళగిరి, హిందూపురం, రాజంపేట సహా చిత్తూరును క్లీన్స్వీప్ చేయాలన్న ప్రధాన లక్ష్యాలను సాధించాలనేది పెద్దిరెడ్డిపై పెట్టిన లక్ష్యాలు. దీంతో ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ప్రధాన మీడియాకు దూరంగా ఉంటున్నారు.
దీంతో అసలు పెద్దిరెడ్డి మాటే ఎక్కడా వినిపించడం లేదు. కానీ, క్షేత్రస్థాయిలో ఆయన మాత్రం దూసుకు పోతున్నారు. ఎక్కడికక్కడ తన వారిని నియమించారు. కుప్పంను తీసుకుంటే.. పైకి కనిపించే వైసీపీ అభ్యర్తి భరత్ మాత్రమే కానీ.. అంతర్గతంగా చూస్తే.. ప్రతి వార్డులోనూ పెద్దిరెడ్డి అభ్యర్తి ఉన్నారనేది నిష్ఠుర సత్యం. గతంలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక జరిగినప్పుడు.. పెద్దిరెడ్డితోపాటు.. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి కూడా సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు.
అప్పట్లోనూ వార్డు కొకరు చొప్పున వైసీపీ నాయకులను ఎంపిక చేసి తతంగాన్ని నిర్విఘ్నంగా ముగించా రు. ఇప్పుడు కూడా.. అదే రీతిలో పిఠాపురం నుంచి కుప్పం వరకు పెద్దిరెడ్డి ప్రత్యేక అజెండాతో ముందు కు పోతున్నారు. దీనినే సైలెంట్ రాజకీయం అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన రాజకీయాల్లో ఒకటిగా పరిశీలకులు చెబుతారు. 2019 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ కూడా.. కాంగ్రెస్ నేత రాహుల్ను ఓడించేందుకు యూపీలో ఇలానే చేశారు. ఇప్పుడు పెద్దిరెడ్డి సైతం ఇలానే చేస్తున్నారు. దీనిని టీడీపీ గుర్తించి జాగ్రత్త పడకపోతే కష్టమనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.