ఆమె వైద్యురాలు కాదు. కానీ, వైద్యులను నడిపించే మేనేజ్మెంట్ తెలిసిన వ్యాపారవేత్త. వికాస్ వైద్య శాలల అధినేత్రి. ఆమెకు రోగుల ఆరోగ్య నాడి తెలియకపోవచ్చు. కానీ, వారి ఆర్థిక నాడి, వారి సమస్యల నాడి, వారి ఇబ్బందుల నాడి.. మాత్రం కూలంకషంగా తెలుసు. ఆమే.. ప్రస్తుతం గుంటూరు వెస్ట్ నుంచి బీజేపీ – టీడీపీ – జనసేన కూటమి పక్షాన అభ్యర్థిగా రంగంలోకి దిగిన పిడుగురాళ్ల మాధవి. ప్రజలకు సుపరిచయం ఉన్న నాయకురాలు.
అంతేకాదు.. స్థానికంగా కొన్ని దశాబ్దాలుగా ఆమె ఉంటున్నారు. అంతేకాదు.. దవాబ్ద కాలంగా ఇక్కడ మాధ వి కుటుంబం అనేక వ్యాపారాలు చేస్తోంది. దీంతో స్థానికులతో ఆమెకు విస్తృత పరిచయాలు ఉన్నాయి. మరోవైపు.. ప్రజల సమస్యలను తెలుసుకోవడంలో మాధవిది అందెవేసిన చేయి. `మా దగ్గరకు ఎంతో మంది పేషంట్లు వస్తుంటారు. వారి స్థితిగతులు అన్ని దాదాపు మాకు తెలుస్తాయి. వారిని ఏదో ఒక రకంగా ఆదుకునేందు కు ప్రయత్నాలు చేస్తాం` అని చెప్పే మాధవికి ఇక్కడ బ్రహ్మరథం పట్టేందుకు ఎంతో మంది ఉన్నారు.
ఇప్పటికే వికాస్ పేరుతో చేస్తున్న సేవా కార్యక్రమాలను మరింత పుంజుకునేలా చేసి.. ప్రజలకు మరింత సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో ఆమె రాజకీయ అరంగేట్రం చేశారు. వచ్చి రావడంతోనే వెస్ట్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వెంటనే గుర్తించి వాటిని పబ్లిక్లో వినిపిస్తున్నారు. నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న పార్కులు, రహదారుల, డ్రైనేజ్లు, అపరిశుభ్ర వాతావరణంతో ప్రజలు ఎలా రోగాల పాలవుతున్నారో లాంటి అంశాలను ఆమె బహిరంగంగానే చర్చిస్తున్నారు. మాటల్లో స్పష్టత… సూటిగా ప్రశ్నిస్తుడడం.. సింపుల్ డైలాగులతోనే ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ ప్రజల్లో ఆలోచింపజేచేసేలా ఉన్న ఆమె మనస్తత్వానికి వెస్ట్ ప్రజలు ఫిదా అవుతున్నారు.
పార్టీకి కంచుకోట అయిన ఈ సీటు కోసం టీడీపీలో ఎంతో మంది ఉద్దండులు అయిన నేతలు ప్రయత్నాలు చేశారు. కానీ, చంద్రబాబు సేవా గుణం.. ఆర్తికంగా ఎలాంటి విమర్శలు లేని.. పెట్టే చేయిగా పేరు పొందిన మాధవిని ఎంపిక చేయడం గమనార్హం. ఇక, ఇక్కడి ప్రజలకు కూడాఆమె తెలిసి ఉండడం.. మరో కలిసి వస్తున్న విషయం. పైగా నియోజకవర్గానికి అంకిత భావంతో ఇక్కడే ఇల్లు , వ్యాపారాలు కూడా ఉండడం మరో ప్రధాన విషయం. దీంతో మాధవి పేరు ఇప్పుడు నియోజకవర్గంలో ఏ గల్లీ లోవిన్నా మార్మోగుతోంది. ఆమె గెలుపు ఇప్పటికే డిసైడ్ అయిందని ఆమె అభిమానులు అంటున్న మాటలో అతిశయోక్తి లేదని అనిపిస్తోంది.