రాజకీయాల్లో ఒక్కొక్కసారి అనుకున్నవి ఏవీ కూడా అనుకున్నట్టుగా జరగవు. రివర్స్ అవుతుంటాయి. ఇలాంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఓడించాలనే రాజకీయ పార్టీగా వైసీపీ లక్ష్యం. ఇది సహజం కూడా.. ప్రత్యర్థి పార్టీలు ఓడిపోవాలనే కదా.. టీడీపీ అయినా.. బీజేపీ అయినా.. జనసేన అయినా లక్ష్యంగా పెట్టుకుంటాయి. ఈ క్రమంలో వైసీపీ పెట్టుకున్న లక్ష్యాన్ని కూడా కాదనలేం.
ఈ నేపథ్యంలో పిఠాపురంలోని గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లె మండలాలు ఉన్నాయి. వీటిలో పిఠాపురం మినహా మిగిలిన రెండు మండలాల బాధ్యతలను ఇటీవల వైసీపీ తీర్తం పుచ్చుకున్న ముద్రగడ పద్మనా భానాకి వైసీపీ అప్పగించింది. కుదిరితే పిఠాపురంలోనూ పర్యటించాలని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ము్ద్రగడ.. తనకు కేటాయించి కొత్తపల్లె, గొల్లప్రోలు మండలాల్లో ఉదయం 6 గంటలకే ప్రత్యక్షమవుతు న్నారు. ఇక్కడి నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
వీటిలోనూ గొల్లప్రోలు మండలంలో పద్మనాభానికి స్నేహితులు, బంధువులు కూడా ఎక్కువగా ఉండడం తో ఇది ఆయనకు మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడి ప్రతి ఓటూ.. వైసీపీకి పడేలా చేయాలని ఆయన భావిస్తున్నారు. మొత్తం 60 వేల ఓటు బ్యాంకు ఇక్కడ ఉంది. దీంతో ఇక్కడ ఎక్కువగా శ్రమిస్తు న్నారు. అయితే.. ఆయన చేస్తున్న ప్రయత్నాలు బాగానే ఉన్నా.. గతంలో కాపు ఉద్యమం చేసినప్పుడు కూడా గొల్లప్రోలు మండలంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు.
ఈ మండలం నుంచే ముద్రగడకు ఎక్కువగా మద్దతు కూడా లభించింది. అయితే.. ఆయన కాపు ఉద్య మాన్ని వివిధ కారణాలతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. సడెన్గా వదిలేశారు. అదే ఇప్పుడు ఆయనకు శాపంగా మారింది. ఇక్కడి ఆయన స్నేహితులు, సన్నిహితులు.. ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మమ్మల్ని ఉద్యమానికి దింపి.. మీరు సడెన్గా వదిలేశారు.. రీజనేంటిఅనేది వారి ప్రశ్న. దీనికి ముద్ర గడ చెబుతున్న సమాధానం వారికి మింగుడు పడడం లేదు.
దీంతో ముద్రగడ సమావేశాలను.. ఆయన చేస్తున్న దిశానిర్దేశాలను లైట్ తీసుకుంటున్నారు. పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ముద్రగడకు.. తన ఉద్యమమే.. ఇప్పుడు ఇబ్బందిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు ఆయన పిలుపునిస్తే.. వచ్చిన నాయకులు కూడా ఇప్పుడు రావడం లేదు. వచ్చినా ఆయన మాటలు వినీ విననట్టే వ్యవహరిస్తున్నారు. ఫలితంగా 60 వేల ఓటు బ్యాంకు పై సందేహాలు నెలకొన్నాయి.