Madhuranagarilo April 16 2024 Episode 339: రుక్మిణి హాస్పిటల్ కి వచ్చి మా బాబుకి ఎలా ఉంది అని అడుగుతుంది. మీరెవరు అని డాక్టర్ అడుగుతుంది. నేను పండు కన్నతల్లిని అని రుక్మిణి చెబుతుంది. శ్యామ్ రుక్మిణి ఇప్పుడు ఎందుకు వచ్చింది రా తనను బయటకు పంపించే అని మధుర అంటుంది. పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం అయితే చేయలేదు గానీ చూసి వెళ్ళడానికి వచ్చావా వెళ్ళిపో ఎందుకు వచ్చావు నీవల్లనే పండుకి ఇలా జరిగింది అని రాదా అంటుంది. నా కొడుకుని చూడడానికి మీ పర్మిషన్ నాకు అక్కర్లేదు అని రుక్మిణి అంటుంది. ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా కూరగాయల మార్కెట్ అనుకుంటున్నారు ఇక్కడ గొడవ పడుతున్నారు బయటికి వెళ్ళండి ముందు అని డాక్టర్ కోప్పడుతుంది. శ్యామ్ తనని తీసుకువెళ్లరా అని ధనంజయ్ అంటాడు.శ్యామ్ రుక్మిణిని బయటికి తీసుకు వస్తాడు.కట్ చేస్తే,ఏంటి శ్యామ్ రాధకి మీ అమ్మకి నేను డబ్బు ఇచ్చిన సంగతి చెప్పలేదా నా మెడలో తాళి కట్టిన సంగతి చెప్పలేదా అలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అని రుక్మిణి అంటుంది.
చెప్పలేదు చెప్పలేకపోయాను అని శ్యామ్ అంటాడు. అయితే ఇప్పుడే నేనే చెప్పేస్తాను అని రుక్మిణి అంటుంది. వద్దు రుక్మిణి పండు కోలుకున్నాడు అన్న సంతోషంలో ఉన్నారు మళ్ళీ బాధపడతారు నేనే సమయం చూసుకొని వాళ్లకు చెప్తాను అని శ్యామ్ అంటాడు. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను మళ్ళీ ఒక్కసారి పండును చూడడానికి వస్తాను ఆ లోగా రాదకి నిజం చెప్పేసేయ్ లేదంటే నేనే నిజం చెప్పేస్తాను అప్పుడు ఎవరు అడ్డుపడిన సహించెను భరించను క్షమించను ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ రుక్మిణి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, బావగారు పెళ్లిచూపులు అమ్మయి ఇంట్లో జరగడం ఆనవాయితీ కానీ అమ్మాయిని తీసుకొని అబ్బాయి ఇంటికి రమ్మనడం కొత్తగా ఉంది ఏం చేయను నా పరిస్థితి అలాంటిది అని ప్రసాద్ రావు అంటాడు. పర్వాలేదు బావగారు ఇంత మంచి సంబంధం వచ్చినప్పుడు ఎక్కడ పెళ్లిచూపులు జరిగితే ఏంటి అని పెళ్లికూతురు తండ్రి అంటాడు. విరాజ్ అక్కడికి వస్తాడు. నాన్న వీళ్లంతా ఎవరు అని విరాజ్ అడుగుతాడు.
ఇతను నాకు బావవరస అవుతాడు ఈ అమ్మాయి నాకు చెల్లెలి వరస అవుతుంది తను నాకు కోడలు వరుస అవుతుంది నీకు భార్య అవుతుంది అని వాళ్ళ నాన్న అంటాడు. వాట్ నాకు బార్యవడమేంటి నాన్న అని వీరాజ్ అంటాడు. అవున్రా నీకు పెళ్లి చూపులు అని చెప్తే నువ్వు రావని నేను ఇలా ప్లాన్ చేశాను అని ప్రసాద్ రావు అంటాడు. నాకు పెళ్లి ఇష్టం లేదని నీకు తెలుసు కదా నాన్న అని విరాజ్ అంటాడు. అయితే వెళ్లి రెండు దండలు తీసుకురారా ఒకటి నా ఫోటోకి ఒకటి నా శవానికి వెయ్యి అని వాళ్ళ నాన్న అంటాడు. నేను ఒకసారి అమ్మాయి తో మాట్లాడాలి అని విరాజ్ అంటాడు. నేను కూడా మీ అబ్బాయి తో మాట్లాడాలి అంకుల్ అని స్వప్న అంటుంది. అయితే ఇద్దరు వెళ్లి మాట్లాడుకోండి అని వాళ్ల నాన్న అంటాడు. కట్ చేస్తే, స్వప్న గారు నీకు నేను నచ్చానా అని విరాజ్ అంటాడు. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు చాలా బాగా నచ్చారు అని స్వప్న అంటుంది. అయితే నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమే అన్నమాట అని విరాజ్ అంటాడు. అవును అని స్వప్న అంటుంది.
అయితే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను కానీ భార్యగా మాత్రం స్వీకరించలేను ఎందుకంటే నాకు పెళ్లి ఇష్టం లేదు మా నాన్న ఎంత చెప్పినా వినిపించుకోకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు మా నాన్న కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను మా నాన్న ముందు మనిద్దరం భార్యాభర్తల నటించాలి నాలుగు గోడల మధ్య మంచి స్నేహితుల ఉందాం అని విరాజ్ అంటాడు. అలా ఎంతకాలం అని స్వప్న అంటుంది. మా నాన్న పోయేంతవరకు మా నాన్న పోయిన తర్వాత నువ్వు నాకు విడాకులు ఇచ్చేయొచ్చు నువ్వు నాకు భార్యగా నటించినందుకు బోలెడంత డబ్బు ఇస్తాను నువ్వు వేరే పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండొచ్చు నేను హ్యాపీగా ఉంటాను అని మీరు అంటాడు. అయితే నాకు పెళ్లి ఇష్టం లేదు అని స్వప్న గట్టిగా అరుస్తుంది. ఎందుకమ్మా అలా అరిచావు మా అబ్బాయి అంతగా నచ్చాడా అని ప్రసాద్ రావు అంటాడు.
మీ అబ్బాయి నచ్చడం కాదండి నన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకోమంటున్నాడు మీరు పోయాక నాకు విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకోమంటున్నాడు మీ కోడలుగా నటించి నందుకు నాకు బోలెడంత డబ్బు ఇస్తానంటున్నాడు ఇలాంటి సంబంధానికేనా నాన్న నన్ను ఇంత దూరం తీసుకువచ్చావ్ అని స్వప్న అంటుంది. మీకు మీ పెళ్లికొక దండం బావగారు అంటూ పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతారు.ఇదేంటి విరాజ్ ఇలా చేసావ్ నువ్వు పెళ్లి చేసుకోక పోతే మన వంశం ఇంతటితో ఆగిపోతుంది రా పితృదేవతలు రోదిస్తారు అని ప్రసాదరావు అంటాడు.నువ్వు చేసింది ఏమైనా బాగుందా నాన్న మన వంశం నిర్వంశం కాకుండా ఉండాలి అంటే ఒకటే మార్గం నాకు పెళ్లి చేయాలని ఆలోచన మానేసి మీరు పెళ్లి చేసుకోండి అని విరాజ్ అంటాడు. కట్ చేస్తే, పండు కోలుకుంటాడు రాదా పండు కి అన్నం తినిపిస్తూ ఉంటుంది. అమ్మ నాకు అన్నం వద్దు ఐస్ క్రీమ్ కావాలి అని పండు అంటాడు.
ఇప్పుడే ఆపరేషన్ అయింది కదా నాన్న అన్నం తప్ప ఐస్ క్రీం తినకూడదు మన ఇంటికి వెళ్లాక బోలెడన్ని తిందువు గానిలే అని రాదా నచ్చజెప్పి అన్నం తిన పెడుతుంది. రుక్మిణి అన్న మాటలు గుర్తుకు తెచ్చుకున్న శ్యామ్ రాధకి విషయం చెప్పేయాలి లేదంటే పెద్ద గొడవ చేసేస్తుంది అని అనుకుంటాడు. రాధా నీతో ఒక విషయం మాట్లాడాలి బయటికి రా అని శ్యామ్ అంటాడు. పండు కి టాబ్లెట్ వేయాలండి అని రాదా అంటుంది. నేను వేస్తాను గాని వాడు ఏదో మాట్లాడాలి అంటున్నాడు వెళ్ళు రాదా అని మధుర అనడంతో రాదా శ్యామ్ తో బయటికి వస్తుంది. ఏంటండీ ఏదో చెప్పాలన్నారు చెప్పండి అని రాదా అడుగుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది